అంకురాలకు కేంద్రంగా తెలంగాణ
అంకుర సంస్థలకు తెలంగాణ కేంద్రస్థానం అవుతోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. సీఐఐ- తెలంగాణ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సానుకూల
జయేష్ రంజన్
ఈనాడు, హైదరాబాద్: అంకుర సంస్థలకు తెలంగాణ కేంద్రస్థానం అవుతోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. సీఐఐ- తెలంగాణ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సానుకూల విధానాలే దీనికి కారణమని వివరించారు. అంకుర సంస్థలు అందించే వస్తు, సేవలు వినియోగించుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన వ్యాపార సంస్థలను కోరారు. అంకుర సంస్థల ఆర్థిక అవసరాల విషయంలో సమగ్ర విశ్లేషణ చేపట్టాలని సూచించారు. టీ-హబ్ సీఈఓ శ్రీనివాసరావు మహంకాళి మాట్లాడుతూ అంకుర సంస్థలకు అవసరమైన ప్రపంచ స్థాయి సౌకర్యాలను టీ-హబ్ అందిస్తోందని తెలిపారు. ఇన్వెస్ట్ ఇండియాకు చెందిన పెట్టుబడుల నిపుణుడు అనుభవ్ కుమార్ దాస్, గాయం మోటార్స్ సీఈఓ రాజ గాయం, ఇంటెగ్రా సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఎండీ, సీఈఓ శ్రీరాం సుబ్రమణ్య, సీఐఐ- తెలంగాణ మాజీ ఛైర్పర్సన్ వనితా దాట్ల తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!