Jio: ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా బాటలోనే జియో
ప్రముఖ టెలికాం సంస్థ జియో కూడా ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా బాటలోనే నడిచింది. వచ్చే నెల 1 నుంచి ప్రీపెయిడ్ ఛార్జీలను 21 శాతం వరకు పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించింది. టెలికాం
డిసెంబరు 1 నుంచి ఛార్జీలు పెంపు
దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ జియో కూడా ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా బాటలోనే నడిచింది. వచ్చే నెల 1 నుంచి ప్రీపెయిడ్ ఛార్జీలను 21 శాతం వరకు పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించింది. టెలికాం పరిశ్రమను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే ఛార్జీలు పెంచుతున్నట్లు జియో ఓ ప్రకటనలో తెలిపింది. సవరించిన ప్లాన్ల వివరాలను వెల్లడించింది.
* జియో ఫోన్ కోసం అందుబాటులో ఉన్న ప్రాథమిక ప్లాన్ రూ.75కు బదులుగా ఇకపై రూ.91 చెల్లించాల్సి ఉంటుంది.
* రూ.199 ప్లాన్ (28 రోజులకు 1.5 జీబీ/రోజుకు) ధరను రూ.239కు, రూ.399 ప్లాన్ను (56 రోజులకు 1.5 జీబీ/రోజుకు) రూ.479కు, రూ.444 ప్లాన్ను (56 రోజులకు 2జీబీ/రోజుకు) రూ.533కు, రూ.555 ప్లాన్ను (84 రోజులకు 1.5 జీబీ/రోజుకు) రూ.666కు సవరించింది.
* అదనపు డేటా ప్లాన్లను కూడా రూ.51 నుంచి 61కు (6 జీబీ), రూ.101 నుంచి 121కు (12 జీబీ), రూ.251 నుంచి రూ.301కు (50 జీబీ) పెంచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ