అమెజాన్కు మరో 2 వారాల సమయం
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ముందు హాజరై, వాదనలు వినిపించడానికి ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు మరో రెండు వారాల సమయాన్ని సుప్రీం కోర్టు మంజూరు చేసింది. ఫ్యూచర్ కూపన్స్లో
ఆలోగా అభ్యంతరాలు చెప్పండి
సీసీఐ కేసులో సుప్రీం కోర్టు
దిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ముందు హాజరై, వాదనలు వినిపించడానికి ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు మరో రెండు వారాల సమయాన్ని సుప్రీం కోర్టు మంజూరు చేసింది. ఫ్యూచర్ కూపన్స్లో పెట్టుబడుల లావాదేవీకి సంబంధించి అమెజాన్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలనే పిటిషన్పై విచారణను వాయిదా వేయడానికి సీసీఐ నిరాకరించిన విషయం తెలిసిందే. కేసు పూర్వాపరాలను పరిశీలించదలుచుకోవడం లేదని, దిల్లీ హైకోర్టు ఇచ్చిన సమయం కంటే మరింత సమయాన్ని ఇవ్వాలని భావిస్తున్నట్లు.. తద్వారా సీసీఐ ముందు అమెజాన్ తన వాదన వినిపిస్తుందని ఆశిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలు ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె