ఇండస్ఇండ్లో 26% వాటాకు సిద్ధం: హిందుజాలు
ఇండస్ఇండ్ బ్యాంక్లో తమ వాటాను 26 శాతానికి పెంచుకునేందుకు ప్రమోటర్లైన హిందుజా సోదరులు ఆసక్తిగా ఉన్నారు. ఇందుకోసం 1.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,250 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకూ సిద్ధమని ప్రకటించారు.
రూ.8,250 కోట్లు పెట్టుబడి పెడతాం
ముంబయి: ఇండస్ఇండ్ బ్యాంక్లో తమ వాటాను 26 శాతానికి పెంచుకునేందుకు ప్రమోటర్లైన హిందుజా సోదరులు ఆసక్తిగా ఉన్నారు. ఇందుకోసం 1.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,250 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకూ సిద్ధమని ప్రకటించారు. వాటా పెంచుకునేందుకు ఆర్బీఐ నుంచి మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నామని, ఇవి వెలువడ్డాక వాటా పెంపు నిమిత్తం అవసరమయ్యే నిధులను 2-3 నెలల్లో సమీకరిస్తామని హిందుజా గ్రూపు ఆఫ్ కంపెనీస్ (ఇండియా) ఛైర్మన్ అశోక్ హిందుజా తెలిపారు. పలు దశల్లో వాటా పెంపు ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఇండస్ఇండ్ బ్యాంక్లో ప్రమోటర్లకు 16.54 శాతం వాటా ఉంది. ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రమోటర్లు తమ వాటాను 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునేందుకు ఆర్బీఐ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.