విరిడిస్తో ఎస్ఎస్ఈఎల్ భాగస్వామ్యం
అత్యున్నత సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యూళ్ల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటులో సాంకేతిక సహాయం కోసం జర్మనీకి చెందిన ఇంజినీరింగ్ సేవల సంస్థ విరిడాస్.
ఈనాడు, హైదరాబాద్: అత్యున్నత సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యూళ్ల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటులో సాంకేతిక సహాయం కోసం జర్మనీకి చెందిన ఇంజినీరింగ్ సేవల సంస్థ విరిడాస్.ఐక్యూ జీఎంబీహెచ్తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్కు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (ఎస్ఎస్ఈఎల్) తెలిపింది. ఐఆర్ఈడీఏ ఆహ్వానించిన బిడ్ల విజేతల్లో ఒకటైన ఎస్ఎస్ఈఎల్ 4 గిగావాట్ల సామర్థ్యంతో పీవీ మాడ్యూళ్ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామంది. ఈ ప్రాజెక్టు నాలుగు దశల్లో ఉండబోతోందని, తొలి దశ ఉత్పత్తి 2023 మార్చి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సంస్థ సీఈఓ శరత్ చంద్ర పేర్కొన్నారు. 2024 సెప్టెంబరుకు అన్ని దశలూ సిద్ధం అవుతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఏదో ఒక చోట దాదాపు 700 ఎకరాల్లో ఈ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఉత్పత్తి కేంద్రం ఏర్పాటైన చోట ప్రత్యక్షంగా 6500 మందికి, పరోక్షంగా 1,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి