టెక్‌ మహీంద్రా చేతికి యాక్టివస్‌ కనెక్ట్‌

వర్క్‌ ఎట్‌ హోమ్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్లు అందించే అమెరికా సంస్థ యాక్టివస్‌ కనెక్ట్‌లో 100 శాతం వాటాను 62 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.466 కోట్ల)కు కొనుగోలు చేసినట్లు ఐటీ దిగ్గజం

Published : 04 Dec 2021 01:35 IST

దిల్లీ: వర్క్‌ ఎట్‌ హోమ్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్లు అందించే అమెరికా సంస్థ యాక్టివస్‌ కనెక్ట్‌లో 100 శాతం వాటాను 62 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.466 కోట్ల)కు కొనుగోలు చేసినట్లు ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా వెల్లడించింది. 2020 డిసెంబరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి యాక్టివస్‌ కనెక్ట్‌కు 1750 ఉద్యోగులు ఉండగా, 17 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదుచేసింది. ఈ కొనుగోలు వల్ల వర్థమాన కార్యాలయ సొల్యూషన్లలో టెక్‌ మహీంద్రా సామర్థ్యాలు బలోపేతం అవుతాయని కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని