సేవలు.. శరవేగం
దేశ సేవల రంగ కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. ఈ ఏడాది నవంబరులో సేవల రంగ పీఎంఐ 58.1 పాయింట్లుగా నమోదైంది. అక్టోబరులో ఇది 58.4 పాయింట్లుగా ఉంది. దశాబ్దంలోనే (2011 జులై తర్వాత) ఇది ...
నవంబరు పీఎంఐ 58.1 పాయింట్లు
దిల్లీ: దేశ సేవల రంగ కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. ఈ ఏడాది నవంబరులో సేవల రంగ పీఎంఐ 58.1 పాయింట్లుగా నమోదైంది. అక్టోబరులో ఇది 58.4 పాయింట్లుగా ఉంది. దశాబ్దంలోనే (2011 జులై తర్వాత) ఇది రెండో బలమైన వృద్ధి కావడం విశేషం. సేవల వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడం, గిరాకీ మెరుగవడంతోనే ఇది సాధ్యమైందని ఐహెచ్ఎస్ మార్కిట్ నెలవారీ సర్వే నివేదిక వెల్లడించింది. సేవల రంగ సూచీ 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధిగా, దిగువన ఉంటే క్షీణతగా భావిస్తారు. వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోవడం, విక్రయాలు పెరగడం, వ్యాపార ఆశావాదం వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి దోహదం చేశాయని ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వే వెల్లడించింది. తయారీ, సేవల రంగ కాంపోజిట్ పీఎంఐ సూచీ అక్టోబరులో 58.7 పాయింట్లు కాగా, నవంబరులో 59.2 శాతానికి చేరింది. 2012 జనవరి తర్వాత ఇదే బలమైన వృద్ధి అని ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వే తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ