మార్చి కల్లా ఇండిగోతో కోడ్షేరింగ్ అమలు: అమెరికన్ ఎయిర్లైన్స్
ఇండిగో ఎయిర్లైన్స్తో కోడ్షేరింగ్ ఒప్పందానికి అమెరికా ప్రభుత్వం నుంచి ఆమోదం పొందే క్రమంలో ఉన్నామని అమెరికన్ ఎయిర్లైన్స్ తెలిపింది. 2022 మార్చి కల్లా ఈ ఒప్పందం అమల్లోకి రావచ్చని, టెక్సాస్ కేంద్రంగా పనిచేసే ఈ విమానయాన
దిల్లీ: ఇండిగో ఎయిర్లైన్స్తో కోడ్షేరింగ్ ఒప్పందానికి అమెరికా ప్రభుత్వం నుంచి ఆమోదం పొందే క్రమంలో ఉన్నామని అమెరికన్ ఎయిర్లైన్స్ తెలిపింది. 2022 మార్చి కల్లా ఈ ఒప్పందం అమల్లోకి రావచ్చని, టెక్సాస్ కేంద్రంగా పనిచేసే ఈ విమానయాన సంస్థ ఎండీ టామ్ లాటిగ్ వెల్లడించారు. ఇందువల్ల అమెరికా నుంచి వచ్చేవారికి నేరుగా భారత్లోని గమ్యస్థానాలకు, ఇక్కడి నుంచి అమెరికా వచ్చేవారికి నేరుగా టికెట్లను విక్రయించే అవకాశం లభిస్తుందని తెలిపారు. పదేళ్ల విరామం తరవాత న్యూయార్క్-దిల్లీ విమాన సర్వీసును అమెరికన్ ఎయిర్లైన్స్ నవంబరు 12న పునఃప్రారంభించింది. సియాటెల్-బెంగళూరు విమానం 2022 జనవరి 4కు బదులు మార్చి 25 నుంచి నడవనుందని టామ్ పేర్కొన్నారు. కార్పొరేట్ ప్రయాణాలు మెరుగవ్వకపోవడమే ఇందుకు కారణంగా వివరించారు. భారత్ నుంచి అమెరికా, ఐరోపా మార్గాల్లో ప్రయాణికుల రద్దీని గల్ఫ్ విమానయాన సంస్థలు ఖతార్ ఎయిర్వేస్, ఎమిరేట్స్ సంస్థలు ఒక స్టాప్ విమానాల ద్వారా పంచుకుంటున్నాయి. అయితే తమవి నాన్స్టాప్ సర్వీసులు అయినందున, గిరాకీ బాగుంటుందనే అంచనాను టామ్ వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్