రూ.100 కోట్లతో విటెరో టైల్స్‌ విస్తరణ

బిల్డింగ్‌ మెటీరియల్స్‌ తయారీ సంస్థ అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌, టైల్స్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు రూ.100 కోట్ల పెట్టుబడి పెడుతోంది.

Published : 07 Dec 2021 02:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: బిల్డింగ్‌ మెటీరియల్స్‌ తయారీ సంస్థ అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌, టైల్స్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు రూ.100 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దాపురంలో ఈ సంస్థకు ఉన్న యూనిట్లో విటెరో టైల్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంట్‌ సామర్థ్యాన్ని ప్రస్తుత 15,000 చదరపు మీటర్ల నుంచి 30,000 చ.మీ.కు పెంచుకోవడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా విపణుల్లో అధిక వాటా సంపాదించే అవకాశం కలుగుతుందని అపర్ణ ఎండీ అశ్విన్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని