9 కంటే ఎక్కువ సిమ్‌ కార్డులుంటే మళ్లీ ధ్రువీకరణ

దేశంలో ఒకే వినియోగదారుడి పేరు మీద 9 కంటే ఎక్కువ సిమ్‌ కార్డులుంటే, మళ్లీ ధ్రువీకరణ చేయాల్సిందిగా టెలికమ్యూనికేషన్ల శాఖ (డాట్‌) ఆదేశాలు జారీ చేసింది. పునఃధ్రువీకరణ జరగని పక్షంలో ఆ మొబైల్‌ కనెక్షన్‌ను

Published : 09 Dec 2021 01:53 IST

లేకుంటే కనెక్షన్‌ తొలగింపు: డాట్‌

దిల్లీ: దేశంలో ఒకే వినియోగదారుడి పేరు మీద 9 కంటే ఎక్కువ సిమ్‌ కార్డులుంటే, మళ్లీ ధ్రువీకరణ చేయాల్సిందిగా టెలికమ్యూనికేషన్ల శాఖ (డాట్‌) ఆదేశాలు జారీ చేసింది. పునఃధ్రువీకరణ జరగని పక్షంలో ఆ మొబైల్‌ కనెక్షన్‌ను తొలగిస్తారు. వినియోగదారులు ఏ సిమ్‌ కార్డులను అట్టేపెట్టుకుంటారో ఎంపిక చేసుకునే సౌలభ్యం కల్పించి, మిగతా కనెక్షన్‌లకు డీ యాక్టివేట్‌ చేయాల్సిందిగా డాట్‌ ఆదేశించింది. ఆర్థిక నేరాలు, అవాంఛిత కాల్స్‌, నేరపూరిత కార్యకలాపాల నిరోధానికి డాట్‌ తాజా ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ ధ్రువీకరణ చేయించుకోని అదనపు మొబైల్‌ కనెక్షన్లు డిసెంబరు 7 నుంచి 60 రోజుల్లోగా రద్దవుతాయి. ఒకవేళ చందాదారు విదేశీ పర్యటనల్లో/ఆసుపత్రిలో ఉంటే మరో 30 రోజులు అదనపు సమయం ఇస్తారు. ఒకవేళ ఇలాంటి నెంబరు నుంచి ఇబ్బందికర కాల్స్‌ వస్తున్నాయని ఏదైనా చట్టబద్ధ సంస్థ నిర్ధారిస్తే, 15 రోజుల్లో రద్దవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని