ఐటీ-బీపీఓలో 3.75 లక్షల ఉద్యోగాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ, బీపీఓ రంగాలు కొత్తగా 3.75 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని టీమ్లీజ్ సర్వీసెస్ నివేదిక పేర్కొంది. దేశీయంగా భిన్న రంగాల సంస్థలు టెక్నాలజీ వినియోగాన్ని
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై టీమ్లీజ్ సర్వీసెస్
ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ, బీపీఓ రంగాలు కొత్తగా 3.75 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని టీమ్లీజ్ సర్వీసెస్ నివేదిక పేర్కొంది. దేశీయంగా భిన్న రంగాల సంస్థలు టెక్నాలజీ వినియోగాన్ని పెంచడం, ఐటీ-బీపీఓ రంగాల్లోకి వస్తున్న పెట్టుబడులు ఉపాధి అవకాశాల పెంపునకు దోహద పడతాయని నివేదిక వివరించింది. దేశీయంగా ఐటీ-బీపీఓ రంగాల్లోని 100 సంస్థల నిర్వాహకులను ఇంటర్వ్యూ చేసి, అభిప్రాయాలు సమీకరించడం ద్వారా నూతన నియామకాలపై ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపింది. శాశ్వత ఉద్యోగులదే ఆధిపత్యం అయినా, కాంట్రాక్టు స్టాఫింగ్ కూడా 17 శాతం వృద్ధితో వచ్చే మార్చి కల్లా 1.48 లక్షలకు చేరొచ్చని పేర్కొంది. కార్పొరేట్ యాజమాన్యాలతో పాటు ఉద్యోగులు కూడా కాంట్రాక్టు పద్ధతిని ఇష్టపడుతున్నారని, ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయి ఉద్యోగుల్లో 10-15 శాతం మంది ఈ పద్ధతికి మారుతున్నట్లు వెల్లడించింది. అయిదేళ్లలో కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య మొత్తం ఐటీ-బీపీఓ నిపుణుల్లో 6 శాతానికి చేరొచ్చని వివరించింది.
డిజిటల్ నైపుణ్యాలకే అగ్రస్థానం: డేటా ఇంజినీరింగ్, డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, కృత్రిమమేధ వంటి 13 రకాల డిజిటల్ నైపుణ్యాలు కలిగిన వారికి నియామక సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. 43 శాతం సంస్థలు డిజిటల్ నిపుణులను పెంచుకుంటున్నాయి. 2020-21తో పోలిస్తే, 2021-22లో ఈ నైపుణ్యాలకు ఉపాధి అవకాశాలు 7.5 శాతం పెరగనున్నాయి. కాంట్రాక్టు స్టాఫింగ్లో 50 శాతం వృద్ధి లభిస్తుందని పేర్కొంది. కంపెనీలు తమ ఉద్యోగుల్లో 70-75 శాతం మంది నైపుణ్యాలు మెరుగు పరచుకునేందుకు సహకరిస్తున్నాయి.
ఐటీ-బీపీఓ రంగాల్లో ఉద్యోగాలు
2021 మార్చికి.. 44.7 లక్షలు
2022 మార్చికి.. 48.5 లక్షలు
అయిదేళ్లలో.. 1 కోటి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్