ఫోర్బ్స్‌ శక్తిమంతుల్లోనిర్మలా సీతారామన్‌, ఫల్గుణి నాయర్‌

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మంది మహిళల జాబితాలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (37వ స్థానం), సౌందర్య సాధనాల ఇకామర్స్‌ సంస్థ నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్‌ (88వ స్థానం) చోటు దక్కించుకున్నారు.

Published : 09 Dec 2021 01:54 IST

దిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మంది మహిళల జాబితాలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (37వ స్థానం), సౌందర్య సాధనాల ఇకామర్స్‌ సంస్థ నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్‌ (88వ స్థానం) చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో చోటు కల్పించేందుకు ప్రభావిత స్థాయి, దాతృత్వం, పనితీరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

* ఈ జాబితాలో అగ్రస్థానాన్ని అమెరికా రచయిత్రి దాతృత్వంలో పేరొందిన మెకంజీ స్కాట్‌ పొందారు. మాజీ జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ స్థానాన్ని ఆమె భర్తీ చేశారు. ఇప్పటివరకు 17 సార్లు జాబితా వెలువరించగా.. 15 సార్లు మెర్కెల్‌ అగ్రస్థానంలో నిలిచారు.

* తరవాత స్థానాల్లో కమలా హారిస్‌, క్రిస్టీన్‌ లగార్డే, మ్యారీ బర్రా, మిలిండా గేట్స్‌ నిలిచారు.

* భారత్‌లో తొలి, పూర్తి స్థాయి ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్‌, రాజకీయాల్లోకి రాకముందు అగ్రికల్చర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌, బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌లలో కీలక పదవులు నిర్వర్తించారు.

*  మాజీ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ అయిన ఫల్గుణి ఉద్యోగాన్ని వదులుకుని, 2012లో నైకాను ప్రారంభించారు. ఇటీవల సంస్థ ఐపీఓకు అమిత స్పందన రావడం, షేరు విలువ భారీగా పెరగడంతో, ఆమె నికర సంపద 710 కోట్ల డాలర్లకు చేరింది. దేశీయంగా అత్యంత సంపన్న మహిళగా ఆమె అవతరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని