మహీంద్రా అండ్ మహీంద్రా వాణిజ్య వాహనాలపై ‘అధిక మైలేజీ’ ఆఫర్
మహీంద్రా గ్రూపునకు చెందిన మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీ), తన బీఎస్6 శ్రేణి ట్రక్కులపై ‘అధిక మైలేజీ పొందండి, లేదా ట్రక్ వెనక్కి ఇచ్చేయండి’ అనే వినూత్న ఆఫర్ను ఆవిష్కరించింది.
ఈనాడు, హైదరాబాద్: మహీంద్రా గ్రూపునకు చెందిన మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీ), తన బీఎస్6 శ్రేణి ట్రక్కులపై ‘అధిక మైలేజీ పొందండి, లేదా ట్రక్ వెనక్కి ఇచ్చేయండి’ అనే వినూత్న ఆఫర్ను ఆవిష్కరించింది. బ్లాజో ఎక్స్ ఇఎవీ, ఫ్యూరియో ఇంటర్మీడియేట్, తేలిక పాటి ట్రక్కులైన (ఎల్సీవీ) ఫ్యూరియో 7, జయో వాహనాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది. ‘ఫ్యూయర్స్మార్ట్ టెక్నాలజీ’, మైల్డ్ ఈజీఆర్, ఐమ్యాక్స్ టెలీమ్యాటిక్స్ సొల్యూషన్... వంటి సాంకేతిక ప్రత్యేకతలు కల... 7.2 లీటర్ల- ఎంపవర్ ఇంజన్/ ఎండీఐ టెక్ ఇంజిన్లను ఈ వాహనాల్లో వినియోగించినందున అధిక మైలేజీ సాధ్యమని మహీంద్రా గ్రూపు వివరించింది. వాహనాల నిర్వహణ వ్యయాల్లో 60 శాతం వరకు ఇంధన ఖర్చే ఉంటుందని, అందుకే అధిక మైలేజీ ఇచ్చే ఇంజిన్లతో తమ వాహనాలను అందిస్తున్నట్లు పేర్కొంది. తమ వాహనాలపై అధిక నమ్మకం ఉండటం వల్లే ఈ ఆఫర్ ప్రకటించినట్లు ఎంఅండ్ఎం సీఈఓ వీజే నక్రా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్