విమానయానానికి రూ.20,000 కోట్ల నష్టం!
కొవిడ్-19 మూడో దశ పరిణామాలకు తోడు, ఇంధన ధరల పెరుగుదలతో విమానయాన సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.20,000 కోట్ల నికర నష్టం వాటిల్లే అవకాశం ఉందని క్రిసిల్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో వాటిల్లిన నష్టం రూ.13,853 కోట్లతో పోలిస్తే ఇది 44 శాతం
కొవిడ్ మూడో దశ, ఏటీఎఫ్ ధరల పెంపు వల్లే
ముంబయి: కొవిడ్-19 మూడో దశ పరిణామాలకు తోడు, ఇంధన ధరల పెరుగుదలతో విమానయాన సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.20,000 కోట్ల నికర నష్టం వాటిల్లే అవకాశం ఉందని క్రిసిల్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో వాటిల్లిన నష్టం రూ.13,853 కోట్లతో పోలిస్తే ఇది 44 శాతం ఎక్కువని తెలిపింది. పరిశ్రమలో రికవరీ 2022-23 తరవాతే సాధ్యమవుతుందని పేర్కొంది. దేశీయ విమానయాన విపణిలో 75 శాతం వాటా ఉన్న ఇండిగో, స్పైస్జెట్, ఎయిరిండియా సంస్థల్ని ఆధారంగా చేసుకుని ఈ నివేదికను క్రిసిల్ రూపొందించింది.
* కొవిడ్ రెండో దశ తర్వాత, 2021 డిసెంబరులో కొవిడ్ పూర్వ స్థితిలో (2019 డిసెంబరు) 86 శాతానికి ప్రయాణికుల సంఖ్య పెరిగింది. 2022 జనవరి నుంచి అంతర్జాతీయ విమానాలు కూడా నడుస్తాయని భావించారు. అయితే కొవిడ్ మూడో దశ ప్రభావంతో ఈనెల మొదటి వారంలో దేశీయ విమాన ప్రయాణాలు 25 శాతానికి పరిమితమయ్యాయి. 2021 ఏప్రిల్-మేలో కొవిడ్ రెండో దశలో కనిపించిన ధోరణే (అప్పుడూ 25, 66 శాతం క్షీణించాయి) ఇప్పుడూ మళ్లీ కనిపించింది.
* క్రిసిల్ డైరెక్టర్ నితేశ్ జైన్ ప్రకారం, ఇప్పటికే ప్రధాన 3 విమానయాన సంస్థలు కలిపి సెప్టెంబరుతో ముగిసిన 6 నెలల కాలానికి రూ.11,323 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించాయి. డిసెంబరు త్రైమాసికంలో విమాన ప్రయాణాలు పెరగడంతో నష్టాలు తగ్గొచ్చనుకున్నా, ఒమిక్రాన్ కేసుల ప్రభావంతో నాలుగో త్రైమాసికంపై భారీ ప్రభావం పడుతుంది. దీంతో నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
* ప్రయాణికుల భర్తీ గత డిసెంబరులో 80 శాతానికి చేరింది. 2021 మేలో ఇది 50 శాతంగానే ఉండేది. అంతర్జాతీయ విమాన సర్వీసుల ద్వారా అధిక లాభదాయకత ఉంటుంది. కానీ వాటిని ఎప్పటికప్పుడు రద్దు చేస్తుండటంతో ఈ రంగంపై తీవ్ర ప్రభావం కనిపించనుంది.
* అధిక ఇంధన ధరలు కూడా సంస్థల నిర్వహణ వ్యయాన్ని పెంచుతున్నాయి. 2021 నవంబరులో లీటరు ఏటీఎఫ్ ధర రూ.83కు చేరింది. ఇది జీవన కాల గరిష్ఠ స్థాయి. 2020-21లో ఇది సరాసరిన రూ.44గా ఉండేది. 2021-22 ఏప్రిల్-జూన్లో కూడా రూ.63గా ఉంది. గత డిసెంబరులో పలు రాష్ట్రాలు వ్యాట్ రద్దు చేయడంతో ఏటీఎఫ్ ధర 6-8 శాతం తగ్గినా, ఈ నెలలో మళ్లీ 2 సార్లు ఇంధన ధర పెరిగింది. ప్రస్తుతం దిల్లీలో లీటరు ఏటీఎఫ్ రూ.79.3కు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి