మ్యాక్సివిజన్‌ హాస్పిటల్స్‌కు నూతన సీఈఓ

హైదరాబాద్‌లోని మ్యాక్సివిజన్‌ హాస్పిటల్స్‌కు వి.ఎస్‌.సుధీర్‌ నూతన సీఈఓగా నియమితులయ్యారు. ఆయన గత అయిదేళ్లుగా మ్యాక్సివిజన్‌ గ్రూపు సీఓఓ (చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌) గా

Published : 19 Jan 2022 03:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మ్యాక్సివిజన్‌ హాస్పిటల్స్‌కు వి.ఎస్‌.సుధీర్‌ నూతన సీఈఓగా నియమితులయ్యారు. ఆయన గత అయిదేళ్లుగా మ్యాక్సివిజన్‌ గ్రూపు సీఓఓ (చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌) గా పనిచేస్తున్నారు. ఆయనకు తాజాగా సీఈఓ బాధ్యతలు అప్పగించినట్లు మ్యాక్సివిజన్‌ గ్రూపు ఛైర్మన్‌ డాక్టర్‌ జీఎస్‌కే వేలు తెలిపారు. గత అయిదేళ్లలో మ్యాక్సివిజన్‌ గ్రూపు టర్నోవర్‌ రూ.50 కోట్ల నుంచి రూ.250 కోట్లకు చేరుకుందని, రెండేళ్లలో దీన్ని రూ.700 కోట్లకు పెంచాలనేది తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఈ లక్ష్యసాధనకు వి.ఎస్‌.సుధీర్‌ కృషి చేయగలరని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని