నేటి నుంచి టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహన ధరల పెంపు

ప్రయాణికుల వాహనాల ధరల్ని బుధవారం నుంచి సగటున 0.9 శాతం మేర పెంచబోతున్నట్లు టాటా మోటార్స్‌ మంగళవారం వెల్లడించింది. ముడి పదార్థాల ధరల వల్ల, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో,

Published : 19 Jan 2022 03:43 IST

దిల్లీ: ప్రయాణికుల వాహనాల ధరల్ని బుధవారం నుంచి సగటున 0.9 శాతం మేర పెంచబోతున్నట్లు టాటా మోటార్స్‌ మంగళవారం వెల్లడించింది. ముడి పదార్థాల ధరల వల్ల, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో, అందులో కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. టియాగో, పంచ్‌, హ్యారియర్‌ తదితర వాహనాలను దేశీయ విపణిలో సంస్థ విక్రయిస్తోంది. జనవరి 18 కంటే ముందు బుక్‌ చేసుకున్న వాహనాలపై ఈ ధరల పెంపు వర్తించదని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని