ఎల్టీఐ లాభంలో 18% వృద్ధి
అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ విభాగమైన ఎల్టీఐ నికర లాభం 18 శాతం పెరిగి రూ.621.50 కోట్లకు చేరింది. ఆదాయాల్లో వృద్ధి ఇందుకు దోహదం చేసింది.
ముంబయి: అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ విభాగమైన ఎల్టీఐ నికర లాభం 18 శాతం పెరిగి రూ.621.50 కోట్లకు చేరింది. ఆదాయాల్లో వృద్ధి ఇందుకు దోహదం చేసింది. కార్యకలాపాల ఆదాయం 2020-21 ఇదే కాలంతో పోలిస్తే 31.2 శాతం పెరిగి రూ.4,137 కోట్లుగా నమోదైంది. 2021-22 జులై- సెప్టెంబరుతో పోల్చినా ఆదాయంలో 9.8 శాతం వృద్ధి ఉంది. డిజిటలీకరణపై క్లయింట్లు ఎక్కువగా దృష్టి సారిస్తున్నందున మున్ముందు కూడా తమ వృద్ధి ఇలాగే కొనసాగుతుందని ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ మేనేజింగ్ డైరెక్టరు, సీఈఓ సంజయ్ జలోనా ఆశాభావం వ్యక్తం చేశారు. నికర ఆదాయ మార్జిన్ను మున్ముందు కూడా 14- 15 శాతం నమోదు చేస్తామని పేర్కొన్నారు. సమీక్షా త్రైమాసికంలో నికరంగా 1,200 మందిని నియమించుకోవడంతో, మొత్తం సిబ్బంది సంఖ్య 44,200కి చేరిందని ఆయన పేర్కొన్నారు. అన్ని సంస్థల్లోనూ నిపుణులకు గిరాకీ అమితంగా పెరగడంతో, వలసల రేటు 22.5 శాతానికి చేరిందని, దీనిని కూడా తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. మొత్తం ఆదాయంలో అత్యధికంగా ఉత్తర అమెరికా విపణిది 66 శాతం వాటా కాగా.. విభాగాల్లో 32.8 శాతం వాటాతో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు ముందు వరుసలో ఉన్నాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట