
మదుపర్ల అవగాహనకు సెబీ మొబైల్ యాప్
దిల్లీ: సెక్యూరిటీల మార్కెట్కు సంబంధించిన ప్రాథమిక అంశాల్లో మదుపర్లకు అవగాహన తెచ్చేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త మొబైల్ యాప్ ‘సాRsథీ’ని తీసుకొచ్చింది. మొబైల్ ద్వారా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ యాప్ను విడుదల చేసినట్లు సెబీ ఛైర్మన్ అజయ్ త్యాగీ వెల్లడించారు. ఇటీవల కాలంలో మార్కెట్లోకి చిన్న మదుపర్ల రాక గణనీయంగా పెరిగిందని, వారికి పనికొచ్చే సమాచారం కొత్త యాప్లో ఉంటుందని తెలిపారు. యువతకు ఈ యాప్ బాగా ఉపయోగపడుతుందన్నారు. సెక్యూరిటీల మార్కెట్, కేవైసీ ప్రక్రియ, ట్రేడింగ్, సెటిల్మెంట్, మ్యూచువల్ ఫండ్లు, ఇటీవల మార్కెట్ పరిణామాలు, మదుపర్ల సమస్యల పరిష్కార విధానం వంటి వివరాలు ఇందులో ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో లభించే ఈ యాప్ను ఆండ్రాయిడ్ ప్లేస్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.