మదుపర్ల అవగాహనకు సెబీ మొబైల్‌ యాప్‌

సెక్యూరిటీల మార్కెట్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాల్లో మదుపర్లకు అవగాహన తెచ్చేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త మొబైల్‌ యాప్‌ ‘సాRsథీ’ని తీసుకొచ్చింది. మొబైల్‌ ద్వారా స్టాక్‌

Published : 20 Jan 2022 01:41 IST

దిల్లీ: సెక్యూరిటీల మార్కెట్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాల్లో మదుపర్లకు అవగాహన తెచ్చేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త మొబైల్‌ యాప్‌ ‘సాRsథీ’ని తీసుకొచ్చింది. మొబైల్‌ ద్వారా స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేయడం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ యాప్‌ను విడుదల చేసినట్లు సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగీ వెల్లడించారు. ఇటీవల కాలంలో మార్కెట్‌లోకి చిన్న మదుపర్ల రాక గణనీయంగా పెరిగిందని, వారికి పనికొచ్చే సమాచారం కొత్త యాప్‌లో ఉంటుందని తెలిపారు. యువతకు ఈ యాప్‌ బాగా ఉపయోగపడుతుందన్నారు. సెక్యూరిటీల మార్కెట్‌, కేవైసీ ప్రక్రియ, ట్రేడింగ్‌, సెటిల్‌మెంట్‌, మ్యూచువల్‌ ఫండ్లు, ఇటీవల మార్కెట్‌ పరిణామాలు, మదుపర్ల సమస్యల పరిష్కార విధానం వంటి వివరాలు ఇందులో ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో లభించే ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌ ప్లేస్టోర్‌, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని