డిసెంబరులో దేశీయ విమాన ప్రయాణికులు 1.12 కోట్లు
డిసెంబరులో దేశీయ మార్గాల్లో 1.12 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. నవంబరులో ప్రయాణించిన 1.05 కోట్ల మందితో పోలిస్తే,
దిల్లీ: డిసెంబరులో దేశీయ మార్గాల్లో 1.12 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. నవంబరులో ప్రయాణించిన 1.05 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 6.7 శాతం ఎక్కువ. మొత్తం మీద 2021లో దేశీయ మార్గాల్లో 8.38 కోట్ల మంది ప్రయాణించారు. 2020లో నమోదైన 6.3 కోట్లతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్యలో 33 శాతం వృద్ధి ఉంది. 2021 డిసెంబరులో ఇండిగో విమానాల్లోనే 61.41 లక్షల మంది ప్రయాణించారు. మొత్తం విమాన ప్రయాణికుల్లో ఈ సంఖ్య 54.8 శాతం కావడం గమనార్హం. గో ఫస్ట్ (ఇంతకుమునుపు గో ఎయిర్) 11.93 లక్షలు, స్పైస్జెట్ 11.51 లక్షలు, ఎయిరిండియా 9.89 లక్షలు, విస్తారా 8.61 లక్షలు, ఎయిరేషియా ఇండియా 7.01 లక్షలు, అలయన్స్ ఎయిర్ 1.25 లక్షల మంది ప్రయాణికులను చేరవేశాయని డీజీసీఏ గణాంకాలు వెల్లడించాయి. స్పైస్జెట్ సీట్ల భర్తీ రేటు 86 శాతం కాగా.. ఇండిగో, విస్తారా, గో ఫస్ట్, ఎయిరిండియా, ఎయిరేషియా ఇండియాలకు వరుసగా 80.2%, 78.1%, 79%, 78.2 శాతం, 74.2 శాతంగా సీట్ల భర్తీ రేటు ఉందని డీజీసీఏ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో