టయోటా హైలక్స్‌ ఎస్‌యూవీ

దేశీయ విపణిలోకి దిగ్గజ ఎస్‌యూవీ మోడల్‌ హైలక్స్‌ను తీసుకొచ్చినట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ వెల్లడించింది. హైలక్స్‌ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని, ఏప్రిల్‌ నుంచి వినియోగదారులకు ఈ వాహనాన్ని

Updated : 21 Jan 2022 12:08 IST

దిల్లీ: దేశీయ విపణిలోకి దిగ్గజ ఎస్‌యూవీ మోడల్‌ హైలక్స్‌ను తీసుకొచ్చినట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ వెల్లడించింది. హైలక్స్‌ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని, ఏప్రిల్‌ నుంచి వినియోగదారులకు ఈ వాహనాన్ని డెలివరీ చేస్తామని సంస్థ తెలిపింది. 2.8 లీటర్‌ డీజిల్‌ పవర్‌ట్రైన్‌ కలిగిన ఈ కారు మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లలో లభించనుంది. 4+4 డ్రైవ్‌, 700ఎంఎం వాటర్‌ వేడింగ్‌ సామర్థ్యం సహా పలు అధునాతన భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ మోడల్‌ ధరను టయోటా కిర్లోస్కర్‌ వచ్చేనెలలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన హైలక్స్‌ కార్లను భారత్‌కు తీసుకురావడం ఆనందంగా ఉందని, ఇప్పటి వరకు 180కు పైగా దేశాల్లో 2 కోట్ల హైలక్స్‌ కార్లు అమ్ముడుపోయాయని టయోటా కిర్లోస్కర్‌ ఎండీ మసకజు యోషిమురా పేర్కొన్నారు. కర్ణాటకలోని బిడది ప్లాంట్‌ నుంచి ఈ కారును ఉత్పత్తి చేయనున్నామని, 30 శాతం స్థానిక భాగాలను వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఎలక్ట్రానిక్‌ డ్రైవ్‌ స్విఛ్‌, ఎలక్ట్రానిక్‌ డిఫ్‌ లాక్‌, డౌన్‌హిల్‌ అసిస్ట్‌ కంట్రోల్‌, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని