సంక్షిప్త వార్తలు
ఫార్చూన్ బ్రాండుపై వంటనూనెలు విక్రయించే అదానీ విల్మర్ తొలి పబ్లిక్ ఆఫర్కు (ఐపీఓ) ధరల శ్రేణిగా రూ.218- 230ను నిర్ణయించారు. ఈ ఐపీఓ జనవరి 27న ప్రారంభమై 31న ముగియనుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ
అదానీ విల్మర్ ఐపీఓ ధరల శ్రేణి రూ.218- 230
దిల్లీ: ఫార్చూన్ బ్రాండుపై వంటనూనెలు విక్రయించే అదానీ విల్మర్ తొలి పబ్లిక్ ఆఫర్కు (ఐపీఓ) ధరల శ్రేణిగా రూ.218- 230ను నిర్ణయించారు. ఈ ఐపీఓ జనవరి 27న ప్రారంభమై 31న ముగియనుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.3,600 కోట్లు సమీకరించనుంది. ఈ నిధులను మూలధన వ్యయాలు, భవిష్యత్ కొనుగోళ్ల కోసం కంపెనీ వినియోగించనుంది. పబ్లిక్ ఇష్యూలో కనీసం 65 షేర్లకు (ఒక లాట్) మదుపర్లు దరఖాస్తు చేసుకోవాలి. ఇష్యూలో జారీ చేసే షేర్లలో సగం షేర్లను అర్హులైన సంస్థాగత మదుపర్లకు, 35 శాతాన్ని చిన్న మదుపర్లకు, 15 శాతాన్ని సంస్థాగతేతర మదుపర్ల కోసం కేటాయించారు.
ఏజీఎస్ ట్రాన్సాక్ట్ ఐపీఓకు
8 రెట్ల స్పందన
ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ రూ.680 కోట్ల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు 8.22 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 2.87 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 22.35 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీ విభాగంలో 2.82 రెట్లు, ఎన్ఐఐల నుంచి 27 రెట్లు, రిటైల్ మదుపర్ల నుంచి 3.25 రెట్ల స్పందన కనిపించింది.
ఎంపీపీతో లారస్ ల్యాబ్స్ ఒప్పందం
ఈనాడు, హైదరాబాద్: మోల్నుపిరవిర్ ఔషధాన్ని ఉత్పత్తి చేసి, వివిధ దేశాలకు పంపిణీ చేయడానికి వీలుగా జెనీవా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎంపీపీ (మెడిసిన్స్ పేటెంట్ పూల్) తో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్కు చెందిన లారస్ ల్యాబ్స్ వెల్లడించింది. మోల్నుపిరవిర్కు యూఎస్, యూకేతో పాటు మనదేశంలో అత్యవసర అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఈ మందుతో కొవిడ్ వ్యాధిని సత్వరం అదుపులోకి తీసుకురావచ్చనే అభిప్రాయం ఉంది. ఎంపీపీ ఒప్పందం ద్వారా ఈ మందును అందుబాటులోకి తీసుకు రానుండటంపై లారస్ ల్యాబ్స్ సీఈఓ సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీపై విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్