26 వరకు రిలయన్స్‌ ‘డిజిటల్‌ ఇండియా సేల్‌’

రిలయన్స్‌ డిజిటల్‌ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అతిపెద్ద ‘డిజిటల్‌ ఇండియా సేల్‌’ ప్రకటించింది. అన్ని రకాలైన ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, క్రెడిట్‌ కార్డు/ డెబిట్‌కార్డు లావాదేవీలపై 10% వరకూ

Published : 23 Jan 2022 02:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: రిలయన్స్‌ డిజిటల్‌ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అతిపెద్ద ‘డిజిటల్‌ ఇండియా సేల్‌’ ప్రకటించింది. అన్ని రకాలైన ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, క్రెడిట్‌ కార్డు/ డెబిట్‌కార్డు లావాదేవీలపై 10% వరకూ తక్షణ తగ్గింపు, రూ.5,000కు మించిన కొనుగోళ్లపై డిజిటల్‌ ఓచర్లు అందిస్తున్నట్లు రిలయన్స్‌ డిజిటల్‌ వెల్లడించింది. రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లు, మై జియో స్టోర్లలో టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, ఇతర గృహోపకరణాలపై ఈ ఆఫర్లు ఈ నెల 26 వరకూ అమల్లో ఉంటాయని వివరించింది. గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లు, ఆండ్రాయిడ్‌ టీవీలపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నట్లు తెలియజేసింది. ఈఎంఐ, ఇతర సులభతరమైన ఫైనాన్షింగ్‌ సదుపాయాలు వినియోగదార్లకు అందిస్తున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని