సెలిస్టియల్ ఇ-మొబిలిటీలో ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్కు 70 శాతం వాటా
మురుగప్ప గ్రూపునకు చెందిన ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (టీఐఐ), రూ.161 కోట్లతో సెలిస్టియల్ ఇ-మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్లో 70 శాతం వాటా కొనుగోలు చేయనుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు
లావాదేవీ విలువ రూ.161 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: మురుగప్ప గ్రూపునకు చెందిన ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (టీఐఐ), రూ.161 కోట్లతో సెలిస్టియల్ ఇ-మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్లో 70 శాతం వాటా కొనుగోలు చేయనుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అంకుర సంస్థ అయిన సెలిస్టియల్ ఇ-మొబిలిటీ..విద్యుత్తు ట్రాక్టర్లు, ఏవియేషన్ గ్రౌండ్ సపోర్ట్ ఎలక్ట్రికల్ యంత్ర సామగ్రి, ఇతర ఎలక్ట్రిక్ యంత్రసామగ్రి ఆవిష్కరణ, ఉత్పత్తిలో నిమగ్నమై ఉంది. ఈ సంస్థ ఇప్పటికే రెండు నమూనా విద్యుత్తు ట్రాక్టర్లను రూపొందించింది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటీవల 3 చక్రాల విద్యుత్తు ఆటోను తీసుకువచ్చే సన్నాహాల్లో ఉంది. దీని కోసం ప్రత్యేకంగా ఒక అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసి, దానిపై రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. సెలిస్టియల్ మొబిలిటీలో మెజార్టీ వాటా కొనుగోలు చేయడం ద్వారా విద్యుత్తు వాహనాల విభాగంలో నూతన అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతామని ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఎం.ఏ.ఎం.అరుణాచలం తెలిపారు. సెలిస్టియల్ ఇ-మొబిలిటీపై ఇంకా పెట్టుబడి పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. విద్యుత్తు వాహనాలకు సంబంధించిన తమ వ్యాపార విభాగాలు/ పెట్టుబడులను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఆలోచన ఉందని, దీని కోసం ప్రత్యేకంగా ఒక అనుబంధ కంపెనీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్