4 నుంచి వేదాంత్‌ ఫ్యాషన్స్‌ ఐపీఓ

మాన్యవర్‌ బ్రాండ్‌ విక్రయశాలలను నిర్వహించే వేదాంత్‌ ఫ్యాషన్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఫిబ్రవరి 4న ప్రారంభమై 8న ముగియనుంది. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో జరిగే ఈ ఇష్యూలో ప్రమోటర్లు,

Published : 26 Jan 2022 03:52 IST

దిల్లీ: మాన్యవర్‌ బ్రాండ్‌ విక్రయశాలలను నిర్వహించే వేదాంత్‌ ఫ్యాషన్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఫిబ్రవరి 4న ప్రారంభమై 8న ముగియనుంది. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో జరిగే ఈ ఇష్యూలో ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లు 3,63,64,838 ఈక్విటీ షేర్లు విక్రయించనున్నారు. ఫలితంగా ఈ ఇష్యూ ద్వారా కంపెనీకి ఎటువంటి నిధులు లభించవు.రైన్‌ హోల్డింగ్స్‌ 1.74 కోట్లు, కేదారా క్యాపిటల్‌ ఆల్టర్‌నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌- కేదారా క్యాపిటల్‌ ఏఐఎఫ్‌ 7.23 లక్షల షేర్లు, రవి మోదీ ఫ్యామిలీ ట్రస్ట్‌ 1.81 కోట్ల షేర్లు విక్రయిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని