ITC: రూ.1,000 కోట్ల నకిలీ బిల్లులు..రూ.181 కోట్ల ఐటీసీ మోసం
రూ.1,000 కోట్ల నకిలీ బిల్లులు జారీ చేయడం ద్వారా, రూ.181 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసానికి పాల్పడిన ఆరోపణలపై 27 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జీఎస్టీ అధికారులు వెల్లడించారు.
దిల్లీ: రూ.1,000 కోట్ల నకిలీ బిల్లులు జారీ చేయడం ద్వారా, రూ.181 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసానికి పాల్పడిన ఆరోపణలపై 27 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జీఎస్టీ అధికారులు వెల్లడించారు. 12వ తరగతి వరకు చదివి అకౌంటెంటు, జీఎస్టీ కన్సల్టెంటుగా పనిచేస్తున్న ఈ వ్యక్తిని ముంబయి జోన్లోని పల్ఘర్ సీజీఎస్టీ కమిషనరేట్ అధికారులు అరెస్టు చేశారు. డేటా మైనింగ్, డేటా విశ్లేషణ ఆధారంగా లభించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. నిథిలన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఈ నకిలీ బిల్లులు జారీ అయ్యాయని పేర్కొంది. మోసాలకు పాల్పడే నిమిత్తం ఆ అకౌంటెంట్ తన క్లయింట్లలో ఒకరి గుర్తింపును ఉపయోగించుకున్నాడని తెలిపింది. ఆ అకౌంటెంట్ను జీఎస్టీ అధికారులు అరెస్టు చేశాక.. రూ.1,000 కోట్లకు పైగా నకిలీ బిల్లులు జారీ చేయడం ద్వారా, రూ.181 కోట్లకు మేర ఐటీసీ మోసానికి పాల్పడిన విషయాన్ని అంగీకరించడాన్ని వెల్లడించింది. అతన్ని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి స్థానిక కోర్టు పంపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్