బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌ బోర్డు విస్తరణ

బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ తమ బోర్డును విస్తరించనున్నట్లు బుధవారం వెల్లడించింది. బోర్డు ఆఫ్‌ ట్రస్టీలుగా మరో నలుగురిని బోర్డులోకి తీసుకొస్తామని ప్రకటించింది.

Published : 27 Jan 2022 03:42 IST

జులైలో కొత్తగా నలుగురు ట్రస్టీల ఎంపిక

బిల్‌-మెలిండా విడాకుల నేపథ్యం

వాషింగ్టన్‌: బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ తమ బోర్డును విస్తరించనున్నట్లు బుధవారం వెల్లడించింది. బోర్డు ఆఫ్‌ ట్రస్టీలుగా మరో నలుగురిని బోర్డులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఈ ప్రక్రియ జులైలో జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఫౌండేషన్‌ కో-చెయిర్స్‌, ట్రస్టీలైన బిల్‌ గేట్స్‌, మెలిండా ఫ్రెంచ్‌ గేట్స్‌ తమ విడాకులను ప్రకటించిన నేపథ్యంలో, కొత్త ట్రస్టీల కోసం వెతుకులాట ప్రారంభిస్తామని పేర్కొంది. 5,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.3.75 లక్షల కోట్లు) అంతర్జాతీయ దాతృత్వ గ్రూప్‌ అయిన ఈ ఫౌండేషన్‌కు ప్రస్తుతం ఆరుగురు మార్గదర్శనం చేస్తున్నారు. గేట్స్‌, మెలిండా విడిపోయిన తర్వాత కూడా ఈ ఫౌండేషన్‌కు కో-చెయిర్లుగా అదనపు అధికారాలు కలిగి ఉంటారని గేట్స్‌ ఫౌండేషన్‌ సీఈఓ మార్క్‌ సుజ్‌మాన్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని