నవభారత్ వెంచర్స్ ఆదాయాల్లో 99% వృద్ధి
నవభారత్ వెంచర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. స్టాండలోన్ ఖాతాల ప్రకారం ఆదాయం రూ.515.71 కోట్లు, నికరలాభం రూ.104.72 కోట్లుగా నమోదైంది. క్రితం
ఈనాడు, హైదరాబాద్: నవభారత్ వెంచర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. స్టాండలోన్ ఖాతాల ప్రకారం ఆదాయం రూ.515.71 కోట్లు, నికరలాభం రూ.104.72 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.258.57 కోట్లు, నికరలాభం రూ.32.50 కోట్లు మాత్రమే. దీంతో పోల్చితే ఆదాయం 99 శాతం, నికరలాభం 222 శాతం పెరిగాయి. ఫెర్రో అల్లాయ్స్ను అధికంగా ఎగుమతి చేయడంతో పాటు, ఒడిశా పవర్ ప్లాంటులోని 60 మెగావాట్ల యూనిట్ (ఐపీపీ) గత ఏడాది జులైలో అందుబాటులోకి రావటంతో సమీక్షా త్రైమాసికంలో మెరుగైన పనితీరు సాధించామని కంపెనీ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి రూ.1,253.98 కోట్ల ఆదాయాన్ని, రూ.252.74 కోట్ల నికరలాభాన్ని సంస్థ ఆర్జించింది.
ఏకీకృత ఖాతాల ప్రకారం మూడో త్రైమాసికంలో ఆదాయం రూ.1,005 కోట్లు, నికరలాభం రూ.190 కోట్లు ఉన్నాయి. 2020-21 ఇదేకాలంలో ఆదాయం రూ.709 కోట్లు, నికరలాభం రూ.161 కోట్లు మాత్రమే. దీని ప్రకారం ఆదాయం 42 శాతం, నికరలాభం 18 శాతం పెరిగాయి.
ఫెర్రో అల్లాయ్స్, విద్యుత్తు విభాగాల పనితీరు ఆకర్షణీయంగా ఉన్నట్లు నవభారత్ వెంచర్స్ సీఈఓ అశ్విన్ దేవినేని ఈ సందర్భంగా తెలిపారు. జాంబియాలో బొగ్గు, విద్యుదుత్పత్తి కార్యకలాపాలు మెరుగు పడుతున్నాయని అన్నారు. ఐవరీకోస్ట్లో మ్యాంగనీస్ గని ప్రాజెక్టులో తవ్వకాలు చేపట్టడానికి అక్కడి ప్రభుత్వ అనుమతి లభించిందని అశ్విన్ వివరించారు. అధిక ఆదాయాలు, లాభాలు ఆర్జించేందుకు, వాటాదార్ల విలువ పెంచేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇటీవల రూ.150 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ పూర్తిచేసినట్లు గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.