ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పెంచిన ఎస్‌బీఐ

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2 కోట్లకు పైబడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20-40 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచినట్లు వెల్లడించింది.

Published : 12 Mar 2022 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2 కోట్లకు పైబడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20-40 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచినట్లు వెల్లడించింది. ఈ నెల 10 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తన వెబ్‌సైటులో పేర్కొంది. 211 రోజుల వ్యవధి డిపాజిట్లపై 3.30 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 3.80శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఏడాది నుంచి 10 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై 3.60శాతం, వయోధికులకు 4.10శాతం వడ్డీ లభిస్తుంది. ఇక రూ.2 కోట్లలోపున్న డిపాజిట్లపై రెండు-వ΄డేళ్ల కాలవ్యవధికి 5.20శాతం, వ΄డు నుంచి అయిదేళ్లలోపు డిపాజిట్లపై 5.45శాతం వడ్డీని అందిస్తోంది. 5-10 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై 5.50శాతం వడ్డీనిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు