ఎల్ఐసీ ఐపీఓ నిర్వహణకు మే 12 వరకు గడువు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల ఆమోదం తెలిపింది. మే 12 వరకు ఐపీఓ ప్రక్రియను ప్రారంభించేందుకు సమయం ఉందని సంస్థకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అప్పటి వరకు తిరిగి తాజా ముసాయిదా
లేదంటే మరోసారి సెబీకి దరఖాస్తు చేయాల్సిందే
దిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల ఆమోదం తెలిపింది. మే 12 వరకు ఐపీఓ ప్రక్రియను ప్రారంభించేందుకు సమయం ఉందని సంస్థకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అప్పటి వరకు తిరిగి తాజా ముసాయిదా పత్రాలను దాఖలు చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఆ గడువు దాటితే మరోసారి ఐపీఓకు అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఎల్ఐసీ ఐపీఓ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు అడ్డంకిగా మారాయి. మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో చలిస్తున్న సమయంలో ఐపీఓకు రావడం మదుపర్లకు అంత లాభదాయకం కాదని యోచిస్తోంది. మార్కెట్లను నిశితంగా పరిశీలిస్తూ, త్వరలో తుది ముసాయిదా పత్రాలు కూడా సమర్పించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సదరు అధికారి వెల్లడించారు. అందులో ధరల శ్రేణి, వివిధ వర్గాల వాటా వంటి వివరాలు ఉంటాయన్నారు. ఈ ఐపీఓ ద్వారా రిటైల్ మదుపర్ల నుంచి రూ.20,000 కోట్ల వరకు సమీకరించాలనే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా చిన్న మదుపర్లు అంత మొత్తం షేర్లకు బిడ్ వేసేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు కోలుకొని, వారిలో విశ్వాసం పెరిగే వరకు వేచి చూడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
*ఎల్ఐసీ ఎంబెడెడ్ విలువను రూ.5 లక్షల కోట్లుగా లెక్కించారు. ఒకవేళ మే 12 నాటికి ఐపీఓకు రాకపోతే.. డిసెంబరు ఫలితాలతో పాటు తాజా ఎంబెడెడ్ విలువతో మరోసారి ముసాయిదా పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఎల్ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. దీంతో రూ.63,000 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు చేరతాయని అంచనా.
*దేశీయంగా ఇదే అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పద్ధతిలో ఉండనుంది. సంస్థలో 100 శాతం వాటా కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాను విక్రయించబోతోంది. గత ఏడాది వచ్చిన పేటీఎం (రూ.18,300 కోట్లు), 2010లో వచ్చిన కోల్ ఇండియా (రూ.15,500 కోట్లు), 2008లో వచ్చిన రిలయన్స్ పవర్ (రూ.11,700 కోట్లు) పబ్లిక్ ఇష్యూలే ఇప్పటి వరకు పెద్ద ఇష్యూలుగా ఉన్నాయి. ఎల్ఐసీ ఐపీఓ తర్వాత స్టాక్ మార్కెట్లో నమోదైతే, విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ల సరసన చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ