Cryptocurrency క్రిప్టో ఆదాయంపై నేటి నుంచి పన్ను
శుక్రవారం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23)లో కొత్త పన్నులు అమల్లోకి రానున్నాయి. క్రిప్టోకరెన్సీల్లో ట్రేడింగ్ ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాల్సిందే. పన్ను
అధిక లావాదేవీలపై 1% టీడీఎస్
దిల్లీ: శుక్రవారం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23)లో కొత్త పన్నులు అమల్లోకి రానున్నాయి. క్రిప్టోకరెన్సీల్లో ట్రేడింగ్ ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాల్సిందే. పన్ను చెల్లింపుదార్ల వార్షికాదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువే ఉన్నా, క్రిప్టో ఆదాయాలపై పన్ను తప్పదు. కొనుగోలు వ్యయం మినహా, మిగతా ఏ విషయంలోనూ పన్ను మొత్తంపై మినహాయింపు ఉండదు.
రూ.50 లక్షల పైన స్థిరాస్తులపై: రూ.50 లక్షలకు పైబడిన స్థిరాస్తుల విక్రయంపై 1 శాతం మూలం వద్ద పన్ను (టీడీఎస్) వసూలు చేస్తారు. సవరించిన నిబంధనల ప్రకారం.. స్టాంప్ విలువ లేదా ఆస్తి విలువలలో ఏది ఎక్కువైతే దానిపై 1 శాతం టీడీఎస్ విధిస్తారు.
పన్ను చెల్లింపుదార్లకు వెసులుబాటు: ఆదాయ పన్ను రిటర్నులలో ఏ విషయమైనా విస్మరించి ఉంటే, సవరించేందుకు పన్ను చెల్లింపుదార్లకు అవకాశం లభించనుంది. స్వచ్ఛందంగా అటువంటి ఆదాయాన్ని నమోదు చేసి, ఆలస్యానికి అనుగుణంగా అదనపు పన్నును చెల్లించొచ్చు. ఏడాదిలో ఒకసారి మాత్రమే అప్డేట్కు అనుమతినిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్