SBI: ఎస్బీఐ రుణ రేట్లు పెరిగాయ్.. నెలవారీ వాయిదా మొత్తాల్లోనూ..
ఎస్బీఐ తన రుణ రేట్లను స్వల్పంగా పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎమ్సీఎల్ఆర్) ఆధారిత రుణ రేట్లను అన్ని కాలావధులకు 10 బేసిస్ పాయింట్ల (0.1 శాతం) మేర ఈనెల 16 నుంచి పెంచినట్లు బ్యాంక్ వెబ్సైట్ వెల్లడిస్తోంది
ముంబయి: ఎస్బీఐ తన రుణ రేట్లను స్వల్పంగా పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎమ్సీఎల్ఆర్) ఆధారిత రుణ రేట్లను అన్ని కాలావధులకు 10 బేసిస్ పాయింట్ల (0.1 శాతం) మేర ఈనెల 16 నుంచి పెంచినట్లు బ్యాంక్ వెబ్సైట్ వెల్లడిస్తోంది. సవరించిన రేట్ల ప్రకారం.. బ్యాంకు రుణాలు 6.75-7.4 శాతం శ్రేణిలో ఉండనున్నాయి. 2020 జులై తర్వాత ఎస్బీఐ చేపట్టిన తొలి రేట్ల సవరణ ఇదే. 2018 డిసెంబరు తరవాత తొలి పెంపు ఇదే. వ్యవస్థలోని అదనపు ద్రవ్యలభ్యతను ఉపసంహరించడం కోసం ‘స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ’ని ప్రవేశపెడుతున్నట్లు ఇటీవల ఆర్బీఐ ప్రకటించిన నేపథ్యంలో తాజా పెంపులు చోటు చేసుకున్నాయి. ఇందువల్ల నెలవారీ వాయిదా మొత్తాలు పెరుగుతాయి.
యాక్సిస్, ఫెడరల్ బ్యాంకులు సైతం: ఫెడరల్ బ్యాంక్ ఎమ్సీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో, రుణ రేట్లు 7.75-8 శాతానికి చేరాయి. యాక్సిస్ బ్యాంకు అన్ని కాలావధులపై 5 బేసిస్ పాయింట్లు పెంచడంతో సవరించిన రేట్లు 7.2-7.55 శాతానికి చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
C-Vigil: సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM