LIC IPO: ఎల్ఐసీ ఐపీఓ నేడే ప్రారంభం
అందరూ ఎదురుచూస్తున్న ఎల్ఐసీ మెగా పబ్లిక్ ఇష్యూ రానే వచ్చింది. నేటి నుంచే ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 9 వరకు అందుబాటులో ఉంటుంది. సోమవారం యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన భాగానికి అధిక స్పందన రావడం విశేషం.
అందరూ ఎదురుచూస్తున్న ఎల్ఐసీ మెగా పబ్లిక్ ఇష్యూ (LIC IPO) రానే వచ్చింది. నేటి నుంచే ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 9 వరకు అందుబాటులో ఉంటుంది. సోమవారం యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన భాగానికి అధిక స్పందన రావడం విశేషం. ఈ నేపథ్యంలో రిటైల్ మదుపర్లు, పాలసీదార్లు (Policyholders), తొలిసారి పబ్లిక్ ఇష్యూ (Public issue)కు దరఖాస్తు చేసుకుంటున్న వారూ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. పబ్లిక్ ఇష్యూ (Public issue) ధరల శ్రేణి రూ.902-949గా ప్రకటించారు. అయితే పాలసీదార్లకు రూ.60; రిటైలర్లు, ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కౌంటు ఇస్తున్నారు.
Also Read: ఎల్ఐసీ షేర్లు కొనాలా వద్దా? బ్రోకరేజీ సంస్థలు ఏమంటున్నాయి?
చాలా వరకు విశ్లేషకులు ఈ ఐపీఓ (IPO)పై బులిష్గానే ఉన్నారు. 30 కోట్ల వరకు పాలసీదార్లు; 13 లక్షల మంది ఏజెంట్లు ఉన్న ఈ సంస్థకు మొత్త బీమా ప్రీమియంలో (2020-21) 64 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2019-20లో రూ.5.7 లక్షల కోట్ల ప్రీమియం ఆదాయంతో భారత బీమా మార్కెట్ రికార్డు సృష్టించింది. ఇందులో ఎల్ఐసీ (LIC)కి రూ.3.8 లక్షల కోట్ల ఆదాయం దక్కింది. ‘ఈ ఐపీఓకి దరఖాస్తు చేయొచ్చు. అయితే స్వల్పకాలానికి కాదు.. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏడాది తర్వాత మళ్లీ వాటా విక్రయం ఉండొచ్చు. కాబట్టి వేచి ఉండాలి’ అని జీసీఎల్ సెక్యూరిటీస్ వైస్ ఛైర్మన్ రవి సింఘాల్ అంటున్నారు.
Also Read: మే 4న ఎల్ఐసీ ఐపీఓ.. 17న లిస్టింగ్.. 10 పాయింట్లలో పూర్తి వివరాలు
ఇతర నమోదిత బీమా కంపెనీలతో పోలిస్తే ఎల్ఐసీ ఐపీఓ (LIC IPO) ధర సహేతుకంగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు. రూ.902-949 ధర వద్ద ఐపీఓ విలువను చూస్తుంటే.. 2021-22 ప్రైస్ టు ఎంబెడెడ్ వేల్యూ(పీ/ఈవీ) విలువకు 1.1 రెట్లు ఉంది. మొత్తం మీద ఆకర్షణీయ విలువలు, భారీ ఆస్తులు, బలమైన బ్రాండ్ విలువ తదితరాల వల్ల ఐపీఓ (IPO)కు మొగ్గుచూపొచ్చని ఎక్కువమంది మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: 29 కోట్ల మంది పాలసీదారులు.. లక్షకు పైగా ఉద్యోగులు! LIC గురించి 10 విషయాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని