Home appliances: పెరగనున్న ఏసీలు, ఫ్రిజ్ల ధరలు
టీవీలు, వాషింగ్మెషీన్లు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్ల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరు లేదా జూన్ మొదటివారంలోనే వీటి ధరలను 3-5 శాతం పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి
మండుతున్న ముడిపదార్థాలు.. రూపాయి పతనం వల్లే
దిల్లీ: టీవీలు, వాషింగ్మెషీన్లు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్ల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరు లేదా జూన్ మొదటివారంలోనే వీటి ధరలను 3-5 శాతం పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ‘ఇప్పటికే ముడి పదార్థాల ధరలు పెరిగాయి. డాలర్ విలువ పెరిగిపోవడంతో, దిగుమతి చేసుకుంటున్న విడిభాగాలకు మరింత మొత్తం చెల్లించాల్సి వస్తోంది. అందువల్ల ఎలక్ట్రానిక్స్ పరికరాల ధరలను త్వరలోనే 3-5 శాతం పెంచాల్సి రావొచ్చ’ని ఎలక్ట్రానిక్స్ తయారీదార్ల సంఘం సీమా అధ్యక్షుడు ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ‘వివిధ ఉత్పత్తుల ధరలను జనవరిలో పెంచాం. మరో 4-5 శాతం పెంచే అవకాశం ఉంద’ని పానసోనిక్ ఇండియా సీఈఓ మనీశ్ శర్మ తెలిపారు. అన్ని బ్రాండ్ల ఉత్పత్తుల ధరలను జూన్-జులైలో 3-5 శాతం పెంచాలని యోచిస్తున్నామని సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈఓ అవ్నీత్ సింగ్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి