ఐఓసీ బోనస్ షేరు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.6,021.88 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.8,781.30 కోట్లతో పోలిస్తే ఇది 31.4 శాతం తక్కువ.
ప్రతి 2 షేర్లకు ఒకటి
తుది డివిడెండ్ రూ.3.60
దిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.6,021.88 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.8,781.30 కోట్లతో పోలిస్తే ఇది 31.4 శాతం తక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.1.63 లక్షల కోట్ల నుంచి 2.06 లక్షల కోట్లకు చేరింది. రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి రెండు షేర్లకు ఒక షేరును బోనస్గా ఇచ్చేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. ఒక్కో షేరుకు రూ.3.60 తుది డివిడెండ్ను (ప్రీ-బోనస్) సంస్థ ప్రకటించింది. గతంలో ప్రకటించిన మధ్యంతర డివిడెండ్ రూ.9 (ప్రీ-బోనస్)కు ఇది అదనం.
* పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2021-22) కంపెనీ నికర లాభం రూ.30,443.93 కోట్ల రికార్డు స్థాయికి చేరింది. 2020-21తో పోలిస్తే లాభం 15 శాతం పెరిగింది.
* రిఫైనింగ్ మార్జిన్లు పెరిగాయి. ప్రతి బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా 11.22 డాలర్ల చొప్పున కంపెనీ ఆర్జించింది. స్థూల రిఫైనింగ్ మార్జిన్ 5.64 డాలర్లుగా నమోదైంది. ఇన్వెంటరీ లాభాలనూ కలుపుకుంటే బ్యారెల్కు 7.61 డాలర్ల లాభం వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా