రూ.12 లక్షల కోట్లు పెరిగిన సంపద
మదుపర్ల కొనుగోళ్లతో సూచీలు కదంతొక్కాయి. లోహ, ఇంధన, బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ మూడు నెలల్లోనే అతిపెద్ద ఒకరోజు లాభాన్ని నమోదుచేశాయి. సెన్సెక్స్ 54,000 పాయింట్ల ఎగువకు చేరగా, నిఫ్టీ 16,200 పైన ముగిసింది.
1345 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
మళ్లీ 16,200 ఎగువకు నిఫ్టీ
సమీక్ష
మదుపర్ల కొనుగోళ్లతో సూచీలు కదంతొక్కాయి. లోహ, ఇంధన, బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ మూడు నెలల్లోనే అతిపెద్ద ఒకరోజు లాభాన్ని నమోదుచేశాయి. సెన్సెక్స్ 54,000 పాయింట్ల ఎగువకు చేరగా, నిఫ్టీ 16,200 పైన ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు పరుగులు తీయడం ఇందుకు కలిసొచ్చింది. డాలర్తో పోలిస్తే రూపాయి ఇంట్రాడేలో రికార్డు కనిష్ఠమైన 77.79కు పడిపోయినా, మళ్లీ కోలుకుని 7 పైసల లాభంతో 77.47 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.49% పెరిగి 114.8 డాలర్లకు చేరింది. చైనాలో కొవిడ్ ఆంక్షలు సడలించొచ్చన్న అంచనాలతో ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. హాంకాంగ్ 2.3%, జపాన్ నిక్కీ 0.2%, కోస్పి 0.7%, షాంఘై కాంపోజిట్ 0.2% చొప్పున కళకళలాడాయి. ఐరోపా సూచీలు కూడా లాభాల్లో ట్రేడయ్యాయి.
* మార్కెట్ ర్యాలీ నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.12.05 లక్షల కోట్లు పెరిగి రూ.255.55 లక్షల కోట్లకు చేరింది.
రోజంతా లాభాల్లోనే: సెన్సెక్స్ ఉదయం 53,285.19 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా కొనుగోళ్ల జోరు కొనసాగడంతో.. ఇంట్రాడేలో 1,425.58 పాయింట్లు దూసుకెళ్లి 54,399.42 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1,344.63 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠమైన 54,318.47 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 417 పాయింట్లు పెరిగి 16,259.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,900.80- 16,284.25 పాయింట్ల మధ్య కదలాడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 తర్వాత సూచీలకు ఇదే అత్యధిక ఒకరోజు లాభం కావడం గమనార్హం.
* సెన్సెక్స్ 30 షేర్లు లాభాలు నమోదుచేశాయి. టాటా స్టీల్ అత్యధికంగా 7.62% దూసుకెళ్లింది. రిలయన్స్ 4.26%, ఐటీసీ 4.15%, విప్రో 3.97%, ఐసీఐసీఐ బ్యాంక్ 3.97%, మారుతీ 3.85%, ఎల్ అండ్ టీ 3.80%, హెచ్సీఎల్ టెక్ 3.77%, బజాజ్ ఫైనాన్స్ 3.38%, టైటన్ 3.10%, ఎస్బీఐ 2.68%, యాక్సిస్ బ్యాంక్ 2.50% చొప్పున మెరిశాయి. అన్ని రంగాల సూచీలు దుమ్మురేపాయి. లోహ 7.62%, ఇంధన 4.13%, చమురు- గ్యాస్ 3.52%, టెలికాం 3.31%, పరిశ్రమలు 3.14% రాణించాయి. బీఎస్ఈలో 2607 షేర్లు లాభాల్లో ముగియగా, 737 స్క్రిప్లు నష్టపోయాయి. 118 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..