పీఎస్ఈ బోర్డు చేతికే అధికారం
యూనిట్లు, అనుబంధ సంస్థల మూసివేత, వాటా విక్రయానికి సంబంధించి ఇక ఆయా ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్ఈలు) బోర్డు డైరెక్టర్లే నిర్ణయం తీసుకోనున్నారు. పీఎస్ఈ బోర్డులకు ఈ అధికారం కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
యూనిట్లు/అనుబంధ సంస్థల మూసివేత
వాటాల ఉపసంహరణ నిర్ణయం కూడా
కేంద్ర మంత్రివర్గ తాజా నిర్ణయం
దిల్లీ: యూనిట్లు, అనుబంధ సంస్థల మూసివేత, వాటా విక్రయానికి సంబంధించి ఇక ఆయా ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్ఈలు) బోర్డు డైరెక్టర్లే నిర్ణయం తీసుకోనున్నారు. పీఎస్ఈ బోర్డులకు ఈ అధికారం కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సంయుక్త సంస్థలు (జేవీ), పూర్తి స్థాయి అనుబంధ సంస్థల ఏర్పాటు కోసం ఈక్విటీ రూపేణ పెట్టుబడులు పెట్టడం, విలీనాలు, కొనుగోళ్లు లాంటి కొన్ని అంశాల్లోనే మాతృ పీఎస్ఈల బోర్డులకు ఇప్పటివరకు అధికారాలున్నాయి. యూనిట్లు, అనుబంధ సంస్థలు, సంయుక్త సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణపై నిర్ణయం తీసుకునే అధికారం ఇప్పటివరకు వాటికి లేదు. మహారత్న పీఎస్యూలకు మాత్రమే అనుబంధ సంస్థలో పాక్షిక వాటా విక్రయానికి కొన్ని పరిమిత అధికారాలు ఉన్నాయి. కార్యకలాపాలు, పెట్టుబడుల పరిమాణంతో సంబంధం లేకుండా యూనిట్లు/అనుబంధ సంస్థలు/సంయుక్త సంస్థల్లో వ్యూహాత్మక వాటా విక్రయం లేదా పాక్షిక వాటా విక్రయం లేదా మూసివేతకు ఇప్పటివరకు కేంద్ర మంత్రివర్గం అనుమతి అవసరం. ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గం పీఎస్ఈల బోర్డులకు అధికారాలు కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని ఓ ప్రకటన వెల్లడించింది. వ్యూహాత్మక పెట్టుబడులకు దీపమ్, మూసివేతకు డీపీఈ (డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్) మార్గదర్శకాలను రూపొందిస్తాయని వివరించింది.
2025-26కే పెట్రోలులో 20% ఇథనాల్
పెట్రోలులో ఇథనాల్ మిశ్రమ శాతాన్ని 20కి చేర్చే లక్ష్యాన్ని 5 ఏళ్లు ముందుకు జరిపారు. 2030కి ఈ లక్ష్యాన్ని సాధించాలని గతంలో నిర్ణయించగా, గడువును 2025-26కు తగ్గించడానికి బుధవారం కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. బయోఇంధన ఉత్పత్తిలో మరిన్ని ముడిపదార్థాలకు(ఫీడ్స్టాక్స్) అనుమతి ఇచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని మంత్రిమండలి బుధవారం ‘నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్’ సవరణలకు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. ఇందులో ప్రధాన సవరణగా పెట్రోలులో 20 శాతం ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని 2030కి బదులుగా 2025-26కు మార్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్