ప్రతి వినియోగదారు నుంచి రూ.200!
ఈ ఏడాదిలో మరో దఫా పెంచే ఛార్జీలతో ప్రతి వినియోగదారు నుంచి ప్రతినెలా వసూలయ్యే సగటు మొత్తం (ఆర్పు) రూ.200కు చేరుతుందని భారతీ ఎయిర్టెల్ భారత్-దక్షిణాసియా ఎండీ, సీఈఓ
తదుపరి టారిఫ్ పెంపుతో సాకారం
ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విత్తల్
దిల్లీ: ఈ ఏడాదిలో మరో దఫా పెంచే ఛార్జీలతో ప్రతి వినియోగదారు నుంచి ప్రతినెలా వసూలయ్యే సగటు మొత్తం (ఆర్పు) రూ.200కు చేరుతుందని భారతీ ఎయిర్టెల్ భారత్-దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్విత్తల్ చెప్పారు. సంస్థ లక్ష్యమైన ఆర్పు రూ.300కు చేరడం అయిదేళ్లలో సాకారమవుతుందని ఇన్వెస్టర్ కాల్లో వివరించారు. 2021 మార్చి త్రైమాసికంలో రూ.145గా ఉన్న ఆర్పు, 2022 మార్చి చివరకు రూ.178కి చేరిందని గుర్తు చేశారు. చిప్సెట్ల కొరత వల్ల స్మార్ట్ఫోన్ల ధరలు పెరిగినా కూడా, 4జీ సేవల్లోకి అదనపు వినియోగదారులను ఆకర్షించగలగడమే ఇందుకు కారణమని చెప్పారు. నెలవారీ అద్దె చెల్లించే (పోస్ట్పెయిడ్) ఖాతాదారుల సంఖ్య 20 కోట్లను అధిగమించినట్లు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
* ద్రవ్యోల్బణం, కమొడిటీ ధరలు, ఇంధన ఛార్జీలు పెరగడం వల్ల వినియోగదారులపై ప్రభావం పడుతుంది. ఇది ఎంత అనేది పరిశీలించాల్సి ఉంది.
* 2021 మార్చి ఆఖరుకు ఎయిర్టెల్కు 32.1 కోట్ల మంది చందాదార్లు ఉంటే, 2022 మార్చి చివరకు ఈ సంఖ్య 32.6 కోట్లకు చేరింది.
* రాబోయే అయిదేళ్లలో బి2బి వ్యాపారం, బ్రాడ్బ్యాండ్ విభాగాలు మరింత పెద్దవి కావాలి. ఆర్పు రూ.300కు చేరాలన్నది లక్ష్యం.
* 2021-22లో కంపెనీ మూలధన పెట్టుబడులు రూ.25,661.6 కోట్లు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇంత లేదా 5జీ సేవల కనుగుణంగా కొంత అధికంగా ఉండొచ్చు.
* 2021 నవంబరు-డిసెంబరుల్లో దేశంలోని మూడు ప్రైవేటు టెలికాం సంస్థలు 18-25 శాతం మేర టారిఫ్లను పెంచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?