58 శాతం పెరిగిన ఐఓబీ లాభం

మార్చి త్రైమాసికంలో ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) రూ.552 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.350 కోట్లతో పోలిస్తే ఇది 58 శాతం అధికం.

Published : 19 May 2022 02:42 IST

దిల్లీ: మార్చి త్రైమాసికంలో ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) రూ.552 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.350 కోట్లతో పోలిస్తే ఇది 58 శాతం అధికం. నిరర్థక ఆస్తులకు కేటాయింపులు రూ.1380 కోట్ల నుంచి రూ.1014 కోట్లకు తగ్గడమే ఇందుకు కారణం. మొత్తం ఆదాయం మాత్రం రూ.6074 కోట్ల నుంచి రూ.5719 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం 4 శాతం పెరిగి రూ.4215 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 11.69 శాతం నుంచి 9.82 శాతానికి, నికర ఎన్‌పీఏలు 3.58 శాతం నుంచి 2.65 శాతానికి తగ్గాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని