జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చేతికి మైత్రా పవన, సౌర విద్యుత్‌ వ్యాపారాలు!

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మైత్రా ఎనర్జీకి చెందిన పవన, సౌర విద్యుత్‌ వ్యాపారాలను జేఎస్‌డబ్ల్యూ గ్రూపు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇరు సంస్థల మధ్య

Published : 19 May 2022 04:50 IST

దిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మైత్రా ఎనర్జీకి చెందిన పవన, సౌర విద్యుత్‌ వ్యాపారాలను జేఎస్‌డబ్ల్యూ గ్రూపు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు ఈ పరిణామాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ వెల్లడించింది. మైత్రా పవన, సౌర విద్యుత్‌ వ్యాపారాల కొనుగోలుకు పోటీ పడుతున్న సంస్థల్లో జేఎస్‌డబ్ల్యూ గ్రూపు ముందంజలో ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ ఆస్తుల విలువను 1.6- 1.7 బి.డాలర్లు (రూ.12,300- 13,000 కోట్లు)గా లెక్కగట్టినట్లు పేర్కొన్నాయి. మైత్రా నిర్వహణలో 1.7 గిగావాట్ల పవన, సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని