stock market: భారీగా పతనమైన మార్కెట్ సూచీలు
దేశీయ మార్కెట్ సూచీలు భారీగా పతనం అయ్యాయి. ఉదయం 9.25 సమయంలో నిఫ్టీ 308 పాయింట్లు పతనమై 1
ఇంటర్నెట్డెస్క్: దేశీయ మార్కెట్ సూచీలు గురువారం భారీగా పతనం అయ్యాయి. ఉదయం 9.25 సమయంలో నిఫ్టీ 308 పాయింట్లు పతనమై 15,932 వద్ద, సెన్సెక్స్ 1,030 పాయింట్లు కుంగి 53,177 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక రంగాల వారీగా అన్ని సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా పవర్, యుటిలిటీస్ సూచీలు 3శాతానికి పైగా విలువ కోల్పోయాయి. జేకే లక్ష్మీ సిమెంట్, రత్నమణి మెటల్స్, ఐటీసీ, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్ షేర్లు అత్యధిక లాభాల్లో ఉండగా.. మణప్పురం ఫినాన్స్, లుపిన్, ఏజెంల్ వన్, డాక్టర్ లాల్పతి ల్యాబ్స్ భారీ నష్టాల్లో ఉన్నాయి.
మరోపక్క అమెరికా మార్కెట్లు కూడా భారీగా నష్టపోవడం దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. దీనికి తోడు మార్కెట్ తీరును అంచనా వేసే విక్స్ సూచీ 9శాతం పెరగడం ఇన్వెస్టర్లను అమ్మకాలకు ప్రోత్సహించింది. ఐరోపా ఖండంలోని ఫైనాన్షియల్ హబ్ అయిన యూకేలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల అత్యధికానికి పెరిగింది. ముఖంగా ఇంధన రంగంలో పెరుగుదల దీనికి కారణమైంది. చివరి సారిగా 1982లో ఈ స్థాయిలో యూకేలో ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ పరిణామాలు మార్కెట్లలో మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..