గోద్రేజ్‌ కన్జూమర్‌ లాభం రూ.363 కోట్లు

ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ గోద్రేజ్‌ కన్జూమర్‌ మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.363.24 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ

Published : 20 May 2022 02:49 IST

దిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ గోద్రేజ్‌ కన్జూమర్‌ మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.363.24 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.365.84 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.2,730.74 కోట్ల నుంచి రూ.2,915.82 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.2,259.12 కోట్ల నుంచి రూ.2,535.05 కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సరం (2021-22)లో కంపెనీ రూ.1,783.39 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. 2020-21లో లాభం  రూ.1,720.82 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.11,028.62 కోట్ల నుంచి రూ.12,276.5 కోట్లకు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని