
ఆరోగ్య బీమా మరింత భారం
సగటున 25% వరకు పెరిగిన ప్రీమియం
ఈనాడు, హైదరాబాద్: కొవిడ్-19 ఎంతోమంది ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఆసుపత్రుల బిల్లులు రూ.లక్షల మేర కావడంతో, తట్టుకునేందుకు చాలామంది ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు మొగ్గు చూపారు. దీంతో ఈ రంగంలో గతంలో ఎన్నడూ లేనంత వృద్ధి నమోదైంది. కొవిడ్ తొలి దశ (2020), రెండో దశ (2021)లో తీసుకున్న చాలా ఆరోగ్యబీమా పాలసీలకు ఇప్పుడు పునరుద్ధరణ సమయం వచ్చింది. అయితే పెరిగిన ప్రీమియాలు పాలసీదార్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
వైద్య ద్రవ్యోల్బణం 30 శాతానికి పైగా పెరిగింది. కొవిడ్ తర్వాత ఎన్నో ఆసుపత్రులు చికిత్స ఖర్చులను అమాంతం పెంచేశాయి. రెండేళ్లుగా అత్యధిక క్లెయింలు రావడంతో, బీమా సంస్థలకు పరిహారం చెల్లింపుల భారం పెరిగింది. అందుకే బీమా సంస్థలు ప్రీమియాన్ని పెంచి, పాలసీదారులపై భారం మోపుతున్నాయి.
మధ్య వయసు నుంచీ పెంపు ఎక్కువ
ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి, కంపెనీలు ప్రీమియాన్ని పెంచుతూ ఉంటాయి. 35 ఏళ్లలోపు వారికి బీమా ప్రీమియం పెద్దగా పెరగలేదు. కానీ, 36 ఏళ్లు దాటిన వారికి ప్రీమియంలో 10-15% భారమయ్యింది. 46 ఏళ్లు దాటిన వారికి బీమా ప్రీమియంలో 30% మేరకు పెంపు కనిపిస్తోంది. 50-55 ఏళ్ల వారికి బీమా సంస్థలు దీన్ని 50% పెంచుతున్నాయి. సీనియర్ సిటిజన్లకు ఈ పెంపు 75% వరకు ఉందని ఒక బీమా సలహాదారుడు పేర్కొన్నారు.
కరోనా తరువాత ముందస్తు అనుమతి లేకుండానే, 5-10 శాతం వరకు ప్రీమియాన్ని పెంచుకునే వెసులుబాటును బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ కల్పించింది. దీన్ని బీమా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. వరుసగా ప్రీమియాలను సవరిస్తూ వెళ్తున్నాయి. ఇక నియంత్రణ సంస్థ అనుమతితో పెంచే మొత్తం దీనికి అదనంగా ఉంటోంది. ఇలా రెండేళ్లలో ప్రీమియం 25-40 శాతానికి పైగా పెరిగింది. ఒకసారి పాలసీ మొత్తం పూర్తయినా.. తిరిగి భర్తీ చేసే ‘రీస్టోర్’ తరహా పాలసీలకు అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది.
మరో సంస్థకు మారినా
ఇప్పుడు బీమా పాలసీ కొనసాగిస్తున్న సంస్థ ప్రీమియం అధికంగా వసూలు చేస్తుంటే తక్కువ ప్రీమియం ఉన్న సంస్థకు పాలసీని బదిలీ (పోర్టబిలిటీ) చేసుకోవచ్చు. అయితే, ఇప్పుడు తక్కువ ప్రీమియం ఉన్నా.. వచ్చే ఏడాది ఆ సంస్థా ప్రీమియం పెంచదనే హామీ ఉండదని బీమా నిపుణులు చెబుతున్నారు. పాలసీని ఎంచుకునేటప్పుడే.. బీమా సంస్థ క్లెయిం చెల్లింపుల చరిత్ర, గతంలో ప్రీమియాన్ని పెంచిన విధానం లాంటివి తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్ డాలర్ల సాయం ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్బాబు
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- social look: లవ్లో పడిన రష్మి.. జిమ్లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
- తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
- IND vs ENG: యువరాజ్ సింగ్ను గుర్తుచేసిన బుమ్రా
- Congress: తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చు రేపిన యశ్వంత్సిన్హా పర్యటన
- Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?