Chitra Ramkrishna: చిత్రా రామకృష్ణకు రూ.3.12 కోట్ల నోటీస్‌

స్టాక్‌ ఎక్స్ఛేంజీలో పాలనా పరమైన అవకతవకలకు సంబంధించిన కేసులో రూ.3.12 కోట్లు  కట్టాలంటూ ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ చిత్రా రామకృష్ణకు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ నోటీసు పంపింది. 15 రోజుల్లోగా చెల్లింపులు

Updated : 25 May 2022 08:36 IST

లేదంటే అరెస్టు; ఆస్తులు, ఖాతాల అటాచ్‌మెంట్‌: సెబీ  

దిల్లీ: స్టాక్‌ ఎక్స్ఛేంజీలో పాలనా పరమైన అవకతవకలకు సంబంధించిన కేసులో రూ.3.12 కోట్లు  కట్టాలంటూ ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ చిత్రా రామకృష్ణకు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ నోటీసు పంపింది. 15 రోజుల్లోగా చెల్లింపులు జరపడంలో విఫలమైతే అరెస్టుకు ఆదేశాలివ్వడంతో పాటు; ఆస్తుల, బ్యాంకు ఖాతాల అటాచ్‌మెంట్‌ జరుగుతుందని హెచ్చరించింది. ఎన్‌ఎస్‌ఈకి చిత్ర కంటే ముందు అధిపతిగా వ్యవహరించిన రవి నరేన్‌, సుబ్రమణియన్‌, ఇతరులపైనా అపరాధ రుసుమును సెబీ గతంలో విధించింది. ప్రస్తుతం చిత్రా రామకృష్ణ దిల్లీలోని తీహార్‌ జైలులో ఉన్నారు. ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్‌ కుంభకోణం కేసులో; ఎక్స్ఛేంజీలో పాలనాపరమైన అవకతవకలపై దర్యాప్తునకు సంబంధించి మార్చి 6న సీబీఐ ఆమెను అరెస్టు చేసింది.

రామకృష్ణ స్టేట్‌మెంట్‌ తీసుకున్న ఈడీ: ఇటీవల చిత్రా రామకృష్ణ స్టేట్‌మెంట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రికార్డు చేసింది. చిత్ర, ఇతరులపై మనీ లాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ‘రెండు సందర్భాల్లో ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేశాం. నగదు అక్రమ బదిలీ నిరోధ చట్టం(పీఎమ్‌ఎల్‌ఏ)లోని క్రిమినల్‌ సెక్షన్ల కింద ఇది జరిగింద’ని వారు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని