ఇళ్ల ధరలు పెరిగాయ్
ఇళ్లు, ఫ్లాట్ల ధరలు మరింత పెరిగాయి. గిరాకీకి తోడు నిర్మాణ ముడి పదార్థాల ధరలు పెరగడం ఇందుకు కారణమని క్రెడాయ్, కాలియర్స్, లియాసెస్ ఫోరాస్ సంయుక్త నివేదిక ఒకటి పేర్కొంది. 2021 జనవరి-మార్చితో పోలిస్తే ఈ ఏడాది ఇదే
8 నగరాల్లో 11 శాతం దాకా ప్రియం
జనవరి-మార్చిపై క్రెడాయ్ సంయుక్త నివేదిక
దిల్లీ: ఇళ్లు, ఫ్లాట్ల ధరలు మరింత పెరిగాయి. గిరాకీకి తోడు నిర్మాణ ముడి పదార్థాల ధరలు పెరగడం ఇందుకు కారణమని క్రెడాయ్, కాలియర్స్, లియాసెస్ ఫోరాస్ సంయుక్త నివేదిక ఒకటి పేర్కొంది. 2021 జనవరి-మార్చితో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో ఇళ్ల ధరలు గరిష్ఠంగా 11 శాతం వరకు ప్రియమైనట్లు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం..
* దిల్లీ-ఎన్సీఆర్లో 11 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.7,363కు చేరింది.
* హైదరాబాద్లో 9 శాతం వరకు పెరిగి కొన్ని ప్రాంతాల్లో చ.అ. రూ.9,232 పలుకుతోంది. అహ్మదాబాద్లో 8% హెచ్చి రూ.5,721; కోల్కతాలో 6% పెరిగి రూ.6,245కు; పుణెలో 3% ప్రియమై రూ.7,485కు చ.అ. ధర చేరింది.
* బెంగళూరు, చెన్నై, ముంబయి మెట్రోపొలిటన్ ప్రాంతం(ఎమ్ఎమ్ఆర్)లలో చదరపు అడుగు 1 శాతం మేర పెరిగి వరుసగా రూ.7,595; రూ.7,107; రూ.19,557కు చేరాయి.
* దేశం మొత్తం నివాసాల ధరలు సగటున 4% పెరిగాయి. నిర్మాణ వ్యయాల వల్ల వచ్చే 6-9 నెలల్లో ఇళ్ల ధరలు మరో 5-10 శాతం పెరగొచ్చని కాలియర్స్ ఇండియా సీఈఓ రమేశ్ నాయర్ పేర్కొన్నారు.
* 2022 జనవరి-మార్చిలో కొత్త ప్రాజెక్టులు కరోనా ముందు స్థాయికి చేరాయి. రాబోయే త్రైమాసికాల్లో మరిన్ని పెరగొచ్చు. ఇటీవలి కాలంలో వడ్డీ రేట్లు పెరిగినా.. విక్రయాలు కొనసాగొచ్చు. ఉక్కు ఉత్పత్తుల ధరలు తగ్గి..నిర్మాణ ప్రాజెక్టుల వ్యయాలు అదుపులోకి రావచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి