ఎన్‌హెచ్‌పీసీ లాభం రూ.516 కోట్లు

మార్చి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ  రూ.515.90 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 26 May 2022 05:43 IST

దిల్లీ: మార్చి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ  రూ.515.90 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాల లాభం రూ.482.35 కోట్లతో పోలిస్తే ఇది 7 శాతం ఎక్కువ. ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,100.12 కోట్ల నుంచి రూ.2,026.62 కోట్లకు చేరింది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికర లాభం రూ.3,774.33 కోట్లకు చేరింది. 2020-21లో ఇది రూ.3,599.88 కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.10,710.86 కోట్ల నుంచి రూ.10,152.84 కోట్లకు తగ్గింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.0.50 (5 శాతం) చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. గత మార్చిలో ఒక్కో షేరుపై ప్రకటించిన మధ్యంతర డివిడెండ్‌ రూ.1.31కి ఇది అదనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని