
హిందుస్థాన్ జింక్లో ప్రభుత్వ వాటా విక్రయం!
ఖజానాకు రూ.38,000 కోట్లు
దిల్లీ: హిందుస్థాన్ జింక్ (హెచ్జడ్ఎల్)లో ప్రభుత్వానికి ఉన్న 29.5 శాతం వాటాను విక్రయించాలన్న ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు తెలిపాయి 29.5 శాతం వాటాకు సమానమైన 124.96 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.38,000 కోట్లు సమకూరే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65000 కోట్లు సమీకరించాలనే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వానికి ఈ లావాదేవీ ఉపయోగపడనుంది. ఈ సమాచారం వెలుగులోకి రావడంతో, బుధవారం హిందుస్థాన్ జింక్ షేరు బీఎస్ఈలో 3.14 శాతం పెరిగి రూ. 305.05కు చేరింది.
2002 వరకు ప్రభుత్వ యాజమాన్యంలోనే హిందుస్థాన్ జింక్ ఉంది. 2002 ఏప్రిల్లో 26 శాతం వాటాను ప్రభుత్వం స్టెర్లైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్కు రూ.445 కోట్లకు విక్రయించింది. తదుపరి మార్కెట్ నుంచి 20 శాతం వాటాను, మరో 18.92 శాతం వాటాను ప్రభుత్వం నుంచి 2003 నవంబరులో వేదాంతా గ్రూప్ కొనుగోలు చేయడం ద్వారా తన మొత్తం వాటాను 64.92 శాతానికి పెంచుకుని, యాజమాన్య నియంత్రణాధికారం సాధించింది. హిందుస్థాన్ జింక్కు ప్రస్తుతం అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంతా లిమిటెడ్ ప్రమోటరుగా వ్యవహరిస్తోంది. హెచ్జడ్ఎల్లో మరో 5 శాతం వాటాను కొనుగోలు చేసే వీలుందని వేదాంతా ఇటీవల ప్రకటించింది కూడా.
భారత్ గోల్డ్ మైన్స్ మూసివేత: భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (బీజీఎంఎల్) మూసివేత ప్రతిపాదనకు కూడా సీసీఈఏ ఆమోదం తెలిపిందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల వెబ్సైట్ వెల్లడించింది. 2001 నుంచి బీజీఎంఎల్ కార్యకలాపాలు ఆపేసింది. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) బీజీఎంఎల్ చేతిలోనే ఉన్నాయి. బ్లాక్బస్టర్ హిట్ సినిమాలైన కేజీఎఫ్ చాప్టర్ 1, 2తో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లోని స్థలాల్లో ఎక్కువ భాగాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్కు బదిలీ చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. సుమారు 250 ఎకరాలను కర్ణాటక ప్రభుత్వానికి ఇవ్వనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: బెయిర్ స్టో సెంచరీ.. ప్రమాదకరంగా మారుతున్న ఇంగ్లాండ్ బ్యాట్స్మన్
-
Business News
Banking frauds: గణనీయంగా తగ్గిన బ్యాంకు మోసాలు
-
India News
Gopal Rai: వాటిపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని కోరతాం: దిల్లీ మంత్రి
-
Crime News
దారుణం.. మైనర్లయిన అక్కాచెల్లెలిపై గ్యాంగ్ రేప్: ఐదుగురు యువకులు అరెస్టు!
-
India News
Maharashtra: ఏడాదిన్నరగా గవర్నర్ నిద్రపోతున్నారా..? కాంగ్రెస్
-
Politics News
BJP: వారసత్వ పార్టీలతో దేశ ప్రజలు విసిగిపోయారు: రవిశంకర్ ప్రసాద్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Samantha: కరణ్.. అన్హ్యాపీ మ్యారేజ్కి మీరే కారణం: సమంత
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Rashmika: విజయ్ దేవరకొండ.. ఇక అందరికీ నీ పేరే చెబుతా: రష్మిక
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!