31% పెరిగిన ఓఎన్జీసీ లాభం
ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.8,859.54 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఆర్జించిన నికర లాభం రూ.6,733.97 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 31.5 శాతం ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ
దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.8,859.54 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఆర్జించిన నికర లాభం రూ.6,733.97 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 31.5 శాతం ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.21,188.91 కోట్ల నుంచి రూ.34,497.24 కోట్లకు ఎగబాకింది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయి నికర లాభం (రూ.40,305.74 కోట్లు) ఆర్జించింది. 2020-21లో నికర లాభం రూ.11,246.44 కోట్లు మాత్రమే. అనుబంధ సంస్థలైన హెచ్పీసీఎల్, ఓఎన్జీసీ విదేశ్ల నికర లాభాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటే, ఓఎన్జీసీ ఏకీకృత నికర లాభం మార్చి త్రైమాసికంలో రూ.12,061.44 కోట్లకు, 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.49,294.06 కోట్లకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..