Cement Rate: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన సిమెంట్ ధరలు
దక్షిణాది రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంటు బస్తా ధరను రూ.20-30 మేర పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 2 నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ముడి పదార్థాల అధిక ధరలతో పాటు ఇంధన వ్యయాలు పెరగడమే ఇందుకు కారణమని వివరించాయి.
హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంటు బస్తా ధరను రూ.20-30 మేర పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 2 నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ముడి పదార్థాల అధిక ధరలతో పాటు ఇంధన వ్యయాలు పెరగడమే ఇందుకు కారణమని వివరించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బస్తాపై రూ.20 పెంచగా, తమిళనాడులో రూ.20-30 మధ్య పెరిగింది. కర్ణాటకలో బ్రాండ్, ప్రాంతం ఆధారంగా ధరల పెంపు వేర్వేరుగా ఉందని తెలుస్తోంది. ధర పెరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సిమెంట్ బస్తా ధర రూ.320-400 మధ్య; తమిళనాడు, కర్ణాటకల్లో రూ.360-450కు చేరింది.
* ధరలు పెంచిన సంస్థలు ఇవే: అల్ట్రాటెక్ సిమెంట్, ఇండియా సిమెంట్స్, కేసీపీ, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, సాగర్ సిమెంట్స్, దాల్మియా భారత్, శ్రీ సిమెంట్, రామ్కో సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్
* ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్లోనే ధరలు పెంచాలని చూసినా, కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో డీలర్లు వ్యతిరేకించారు. దీంతో కంపెనీలు అప్పుడు వెనక్కి తగ్గాయి. గత 3 రోజులుగా సిమెంట్ కంపెనీలు డీలర్లకు సరఫరాలు నిలిపి, ఇప్పటికే ఉన్న పాత స్టాక్ విక్రయించాల్సిందిగా సూచించాయి. కొత్త ధర ప్రకారం, సరఫరాను గురువారం సాయంత్రం నుంచి ప్రారంభిస్తాయని డీలర్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్