మహిళా బృందాలను పెంచనున్న మేక్మైట్రిప్
‘సెలవుల నిపుణులు’తో కూడిన మహిళా బృందాల సంఖ్యను పెంచడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆన్లైన్ పర్యాటక సంస్థ మేక్మైట్రిప్ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ బృందాలు అత్యధిక స్థాయిలో ప్యాకేజీలను విక్రయించడంతో పాటు, స్థిర వృద్ధి నమోదుచేశాయని
దిల్లీ: ‘సెలవుల నిపుణులు’తో కూడిన మహిళా బృందాల సంఖ్యను పెంచడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆన్లైన్ పర్యాటక సంస్థ మేక్మైట్రిప్ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ బృందాలు అత్యధిక స్థాయిలో ప్యాకేజీలను విక్రయించడంతో పాటు, స్థిర వృద్ధి నమోదుచేశాయని తెలిపింది. 2021-22లో సెలవుల నిపుణులుగా సేవలందిస్తున్న మహిళా ఫ్రీలాన్సర్ల బృందాలు దాదాపు రెండు లక్షల మంది పర్యాటకులకు ప్యాకేజీల విషయంలో తోడ్పాటు అందించాయి. గత పదేళ్లలోనే అత్యధిక ప్యాకేజీలను ఈ బృందాలు విక్రయించాయి. ప్రస్తుతం మేక్మైట్రిప్కు 850 మందికి పైగా మహిళా సెలవుల నిపుణులు ఉన్నారు. ఇందులో 43 శాతం మంది తల్లులు, సంరక్షకులు ఉన్నారు. వీరంతా దిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్, ఇండోర్, అహ్మదాబాద్, చండీగఢ్, లఖ్నవూ వంటి నగరాలకు చెందినవారు. మహిళా బృందాలను ఎంత సంఖ్యలో పెంచనున్నారో కంపెనీ వెల్లడించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి