ధ్రువ స్పేస్కు ‘ఇన్ స్పేస్’ గుర్తింపు
అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు రంగ సంస్థల పాత్ర విస్తరించబోతోంది. ప్రైవేటు రంగానికి అవకాశం కల్పిస్తూ నూతన అంతరిక్ష విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం, అందుకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించే ఉద్దేశంతో ఇన్-స్పేస్ (
అంతరిక్ష కార్యకలాపాల్లో విస్తరించే అవకాశం
ఈనాడు, హైదరాబాద్: అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు రంగ సంస్థల పాత్ర విస్తరించబోతోంది. ప్రైవేటు రంగానికి అవకాశం కల్పిస్తూ నూతన అంతరిక్ష విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం, అందుకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించే ఉద్దేశంతో ఇన్-స్పేస్ (ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) అనే సంస్థను ఏర్పాటు చేసింది. రాకెట్ ప్రయోగాలు, అంతరిక్షానికి సంబంధించిన ఇతర కార్యకలాపాలు చేపట్టే ప్రైవేటు రంగ సంస్థలను గుర్తించే పనిని ఈ సంస్థ చేపట్టింది. తాజాగా హైదరాబాద్కు చెందిన ధ్రువ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఇన్-స్పేస్ గుర్తింపు ఇచ్చింది. ఈ సంస్థకు చెందిన శాటిలైట్ ఆర్బిటల్ డిప్లాయర్ (డీఎస్ఓడీ) కు గుర్తించి ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో పాటు బెంగళూరుకు చెందిన దిగంతర రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రోబస్ట్ ఇంటిగ్రేటింగ్ ప్రోటాన్ ఫ్ల్యూయన్స్ మీటర్ (రోబి) కు కూడా గుర్తింపు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ నెల 30 న శ్రీహరి కోట నుంచి ప్రయోగించే పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ (పోయమ్) పేలోడ్లో ఈ రెండు సంస్థల ఉపకరణాలు భాగంగా ఉంటాయి. ఈ రెండు సంస్థల ఉత్పత్తులకు గుర్తింపు ఇవ్వడం ద్వారా, మనదేశం చేపట్టే అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు రంగ సంస్థల అధ్యాయం మొదలవుతోందని ఇన్-స్పేస్ ఛైర్మన్ పవన్ కుమార్ గోయంకా పేర్కొన్నారు.
విదేశీ సంస్థలకూ ఇచ్చే వీలు: ఉపగ్రహ ప్రయోగాలకు అనువైన ఇంజినీరింగ్ సేవలు, ఉత్పత్తులను ధ్రువ స్పేస్ అందిస్తోంది. పీఎస్ఎల్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్టులో ఈ సంస్థకు చెందిన శాటిలైట్ డిప్లాయర్ టెక్నాలజీని ప్రయోగించి చూస్తారు. భవిష్యత్తులో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతర్జాతీయ సంస్థలకు అందించే అవకాశం ఉంటుంది. ఇన్-స్పేస్ గుర్తింపుతో అంతరిక్ష ప్రయోగాల్లో క్రియాశీలకంగా పాలుపంచుకునే అవకాశం తమకు లభిస్తుందని, ఈ గుర్తింపు పొందిన తొలి ప్రైవేటు రంగ సంస్థ తమదేనని ధ్రువ స్పేస్ సీఈఓ సంజయ్ నెక్కంటి అన్నారు. అంతరిక్ష కార్యకలాపాల్లో ఇది విప్లవాత్మక పరిణామమని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు